మళయాళ భామ కీర్తి సురేష్ అంటే తెలుగులో సూపర్ క్రేజ్ ఉంది. నేను శైలజ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి, మహానటి సినిమాల్లో నటించింది. అయితే అజ్ఞాతవాసి రిజల్ట్ తేడా కొట్టేసరికి ఆమెకు స్టార్ అవకాశాలు సన్నగిల్లాయి. మహానటి తర్వాత సౌత్ అంతటా సూపర్ పాపులర్ అయిన కీర్తి సురేష్ కోలీవుడ్ లో వరుస స్టార్ ఛాన్సులు అందుకుంది.


అక్కడ విజయ్, విక్రం లేటెస్ట్ గా రజినికాంత్ సినిమాల్లో కూడా నటిస్తుంది అమ్మడు. కాని తెలుగులో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. రామ్ తో జతకట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత నానితో కలిసి నటించింది. ఒక్క అజ్ఞాతవాసి తప్ప ఆమెకు తెలుగులో స్టార్ ఛాన్సులు రాలేదు. వచ్చిన ఆ ఒక్కటి డిజాస్టర్ అయ్యింది. 


అందుకే కాబోలు తెలుగు స్టార్స్ కీర్తి సురేష్ కు అవకాశాలు ఇవ్వట్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ఫీమేల్ లీడ్ మూవీ చేస్తున్న కీర్తి సురేష్ అక్కినేని నాగార్జున మన్మధుడు 2లో స్పెషల్ రోల్ చేస్తుంది. ఇక నాగ చైతన్య నటించే బంగార్రాజు సినిమాలో కూడా ఆమె నటిస్తుందని తెలుస్తుంది. నాగార్జున లాంటి స్టార్ సినిమాలో ఛాన్స్ వచ్చింది కదా అనుకున్నా అది చాలా చిన్న రోల్ అని తెలుస్తుంది.  


మహేష్, ఎన్.టి.ఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వీళ్లకు అసలు కీర్తి సురేష్ కనబడటం లేదా ఎందుకు ఆమెను చిన్నచూపు చూస్తున్నారు అన్నది తెలియట్లేదు. అయితే వారు చేస్తున్న సినిమాలో హీరోయిన్ పాత్ర కీర్తికి సూట్ అవదు కాబోలు లేదంటే ఆమెను కావాలని ఎందుకు దూరం పెడతారు అంటూ సమర్ధించే వారు ఉన్నారు. ఏది ఏమైనా స్టార్ మెటీరియల్ అయిన కీర్తి సురేష్ అభిమాన హీరో పక్కన చూడాలన్న ఫ్యాన్స్ కోరిక నెరవేరట్లేదని కొందరు ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: