మహేష్ కెరీర్లోనే 25వ సినిమా గా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మహర్షి సినిమా భారీ అంచనాల మధ్య ఇటీవల విడుదలయి బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ కొట్టింది. మహేష్ కెరీర్లోనే అత్యంత ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా రికార్డు సృష్టించింది. తాజాగా ఈ సినిమా విడుదలై 50 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా అద్భుతమైన రికార్డును సృష్టించింది.


దాదాపు 103 కోట్లకు పైగా షేర్ సాధించిన సినిమాగా మహర్షి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక 200 స్క్రీన్స్ లలో విజయవంతంగా సినిమా మరో మూడు రోజుల్లో ఆఫ్ సెంచరీ కొట్టనుంది. చాలా రోజుల తరువాత ఒక సినిమా 50 రోజుల వేడుకను జరుపుకోనుంది. సాధారణంగా ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా ఈ రోజుల్లో 25 రోజులకే థియేటర్స్ లో కనిపించకుండా పోతున్నాయి.


అయితే సూపర్ స్టార్ సినిమా మాత్రం పాత రికార్డుల్ని మళ్ళీ గుర్తు చేసింది. దీంతో చిత్ర యూనిట్ 50 డేస్ సెలబ్రేషన్స్ కి ప్లాన్ చేస్తోంది. జూన్ 28కి శిల్పా కళా వేదికలో వేలాది మంది అభిమానుల నడుమ ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుంది. ఈ వేడుకకు ఇండస్ట్రీ నుండి చాలామంది సినిమా ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: