పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా "ఇస్మార్ట్ శంకర్" సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.  ఇందులో రామ్ పక్కా హైదరాబాదీగా కనిపించనున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటివరకు లవ్ ఇమేజ్ ఉన్న కథలే చేసిని రామ కి ఇదో కొత్త రకం అని చెప్పవచ్చు.  రామ్ లుక్ పూర్తిగా మారిపోయింది ఈ సినిమాలో.

 

పూరి జగన్నాథ్ సినిమాలన్ని హీరో సెంట్రిక్ గానే ఉంటాయి. హీరో చుట్టూనే కథ తిరుగుతుంది. హీరోయిజంని పీక్స్ లో చూపిస్తాడు. అందుకని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయాలని హీరోలు ఉత్సాహం చూపిస్తుంటారు. మహేష్ బాబుతో "పోకిరి " సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. పోకిరి తర్వాత మహేష్ బాబు ఏ రేంజ్ లో పెరిగిందో అందరికీ తెలుసు. బాహుబలి ప్రభాస్ కూడా పూరి డైరెక్షన్ లో నటించడానికి చాలా రోజులు వెయిట్ చేసానని ఒక సందర్భంలో చెప్పాడు.

 

ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ చార్మినార్ దగ్గర షూటింగ్ జరుపుకుంటుండగా,  విరామ సమయంలో హీరో రామ్ సిగరెట్ తాగుతూ కనిపించాడట. అది పబ్లిక్ ప్లేస్ కావడంతో  స్థానిక చార్మినార్‌ ఎస్సై పండరీ రూ.200 జరిమానా విధించారు.బహిరంగ ప్రదేశాలు, రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ధూమపానం చేయడాన్ని నేరంగా పరిగణించి జరిమానా విధిస్తామని హైదరాబాద్‌ పోలీసులు ఇది వరకే హెచ్చరించిన సంగతి తెలిసిందే.

 

ఇది వరకు డ్రంక్ డ్రైవ్ లో పట్టుబడ్డ చాలా మంది సెలెబ్రిటీలను చూసాం. కానీ పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ తాగి పట్టుబడ్డది రామ్ ఒక్కడే. అయితే కథా పరంగా హీరో సిగరెట్ తాగుతూ ఉండాలట. అది ప్రాక్టీసు చేస్తూ అలా ఎస్సై చేతికి దొరికి ఉంటాడని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ సినిమాలో రామ్ లుక్ పూర్తిగా మారిపోయింది. వచ్చేనెలలో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. మరి ఇస్మార్ట్ శంకర్ అందరినీ మెప్పిస్తాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: