టాలీవుడ్ కి పవర్ స్టార్ పవన కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్, ఆ సినిమా హిట్ తో మంచి పేరు సంపాదించారు. ఇక ఆ తరువాత రవితేజ హీరోగా వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి సినిమాల సూపర్ సక్సెస్ లతొ అప్పట్లో టాలీవుడ్ లో మంచి క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు పూరి. ఇక కొన్నాళ్ల తరువాత మహేష్ బాబుతో అయన తీసిన పోకిరి సినిమా సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ అవడంతో పూరి పేరు టాలీవుడ్ లో విపరీతంగా మారుమ్రోగింది. 

ఆ తరువాత దేశముదురు, బిజినెస్ మ్యాన్, చిరుత, బుజ్జిగాడు, గోలీమార్ సినిమాలు పూరికి మంచి పేరు తీసుకువచ్చాయి. ఇకపోతే ఆపై చాలారోజుల తరువాత అయన ఎన్టీఆర్ తో తీసిన టెంపర్, పూరికి మరొక్కసారి మంచి సక్సెస్ ని అందించిన నిలబెట్టింది. అయితే అప్పటినుండి ఇప్పటివరకు పూరికి సరైన సక్సెస్ దక్కలేదు. ఇక ప్రస్తుతం అయన, ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కలిసి ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాను తీస్తున్నాడు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని పాటలు మరియు టీజర్ ని బట్టి చూస్తే ఇది పక్కా మాస్ సినిమా అని అర్ధం అవుతుంది. అయితే ప్రస్తుతం కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా హిట్ అవడం, పూరి మళ్ళి లైం లైట్ లోకి రావడం ఖాయమంటున్నారు. 

ఎంతో కసితో పూరి ఈ కథను రాసారని, ఇదివరకు సినిమాల మాదిరి ఇందులో కూడా అయన రాసుకున్న హీరో క్యారెక్టర్ మంచి పవర్ ఫుల్ గా ఉండడంతో పాటు మాస్ ఆడియన్స్ కు మంచి కిక్ ని ఇస్తుంది అంటున్నారు. మరోవైపు హీరో రామ్ కు కూడా సరైన సక్సెస్ లేకపోవడంతో ఆయనకు కూడా ఈ సినిమా కీలకంగా మారింది. మరి అంచనాలను అందుకుని ఈ సినిమా ఎంతమేర సక్సెస్ ని అందుకుని పూరీని మళ్ళి సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువస్తుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజుల్లో వేచిచూడాల్సిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: