సెలబ్రిటీలు అన్నాక కేవలం పొగడ్తలను మాత్రమే కాదు, విమర్శలను కూడా అందుకుంటూనే ఉంటారు. పైగా సోషల్ మీడియా ప్రభావం వలన ట్రోలర్లు పెరిగిపోయారు. కొందరు సెలబ్రిటీలు ఆన్ లైన్ లో ట్రోలింగ్ పెద్దగా పట్టించుకోరు. కానీ, కొందరు మాత్రం అవకాశం దొరికినప్పుడు వారిపై విరుచుకుపడుతారు. తాజాగా ట్రోలింగ్ పై రియాక్ట్ అయ్యింది రకుల్ ప్రీత్ సింగ్.


గత కొంతకాలంగా తెలుగులో తక్కువ, కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న రకుల్ ఆన్ లైన్ లో ట్రోలింగ్ పై రియాక్ట్ అయ్యింది. తన ఫిగర్ మీద, తన జిమ్ పద్దతుల మీద, తీగ టూల్స్ చేస్తున్న నేపధ్యం లో, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసే వాళ్ళకు పని పాట లేదని మండిపడుతుంది.


'దేశంలో పనిపాట లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. పైగా ఫ్రీ డేటా ప్లాన్స్ కూడా ఉండడంతో సోషల్ మీడియా అందరికి అందుబాటులోకి వచ్చింది.కాబట్టి చేయడానికి పని లేని వాళ్ళు అందరు వేరోకరిపై కామెంట్ చేస్తూ ఉంటారు, నేను కత్తిలాంటి ఫిగర్ అని నాకు తెలుసు, అయినా నా తల్లితండ్రులు, నా స్నేహితులకు అభ్యంతరం లేనప్పుడు నేను సోషల్ మీడియా లో ఏదైనా ఫోటో పెట్టాలి అనుకున్నప్పుడు ఎందుకు భయపడాలి? నేను మిగితా వారి గురించి పట్టించుకోను. ఎందుకంటే మనం అందరిని మెప్పించలేము ' అంటూ కరాకండిగా చెబుతుంది రకుల్.


మరింత సమాచారం తెలుసుకోండి: