ఎన్నో ప్లాపుల తరువాత, ప్ర‌వీణ్ స‌త్తారుతో రాజ‌శేఖ‌ర్ చేసిన చిత్రం `పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ‌` సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. దీంతో రాజ‌శేఖ‌ర్ మ‌ళ్లీ స‌క్సెస్‌ఫుల్ సినిమాల కోసం మంచి క‌థ‌లు విన్నారు. ఆ క్ర‌మంలో ఆయ‌న చేసిన చిత్ర‌మే `క‌ల్కి`. డిఫ‌రెంట్ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ `అ!` వంటి సినిమాను చేసిన ప్ర‌శాంత్ వర్మ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

 

ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మంలో రాజ‌శేఖ‌ర్ త‌న త‌దుప‌రి సినిమాను ప్ర‌క‌టించారు. రాజ‌శేఖ‌ర్ త‌న త‌దుప‌రి చిత్రంగా `గ‌రుడ‌వేగ 2`లో న‌టించ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా .. రాజశేఖర్, ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మ... నాకు సపోర్ట్‌గా ఇద్దరు సూపర్‌ డైరెక్టర్స్‌ ఉన్నారనే ఫీల్‌తో ఉన్నాను. ఇంతకు ముందు కోడి రామకృష్ణగారు, ముత్యాల సుబ్బయ్యగారు, రవిరాజా పినిశెట్టిగారు నాతో చాలా ఎక్కువ సినిమాలు చేశారు.

 

నేను ఎప్పుడైనా కమర్షియల్‌గా కిందకు దిగితే వాళ్లు కాపాడతారనే విశ్వాసం, ధైర్యం ఉండేవి. ఇప్పుడు ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మతో ధైర్యం వచ్చింది. సి. కల్యాణ్‌గారిని ఇంత కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా బిగినింగ్‌లో చూశా. ఈ మధ్య చూసింది లేదు. ఆయన సంతోషానికి కారణం ‘కల్కి’.

 

ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మ నా నటనను కొత్తగా చూపించారు. యంగ్‌ జనరేషన్‌ దగ్గర బాగా వర్క్‌ చేయడం నేర్చుకున్నా. యంగ్‌ జనరేషన్‌కి నేను చెప్పేది ఒక్కటే... మంచి సబ్జెక్ట్‌ ఉంటే రండి, సినిమా చేద్దాం. మనకు సూపర్‌ ప్రొడ్యూసర్‌ కల్యాణ్‌గారు ఉన్నారు. ‘కల్కి’ తర్వాత ‘గరుడవేగ 2’ చేస్తున్నా’’ అన్నారు రాజశేఖర్. అని ఈ వేడుకలో పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: