ఎస్ ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకం పై సుదీప్, సందీప్, రాజు, సుస్మిత హీరోహీరోయిన్లుగా  ఆర్. ఎస్ .సురేష్ దర్శకత్వంలో సందీప్ చెరుకూరి నిర్మాతగా రూపొందిన చిత్రం "ఆగ్రహం"ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం టీజర్ ను రాంగోపాల్ వర్మ ముంబై లో ఆవిష్కరించారు .


ఈ కార్యక్రమం లో చిత్ర దర్శకుడు సురేష్ ,  నిర్మాత చెరుకూరి సందీప్ , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మూర్తి ఆడారి, సంగీత దర్శకుడు రవి శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు .   ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ మాట్లాడుతూ ' రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్ ల మధ్య జరిగే గ్యాంగ్ స్టర్  కధాంశమిది.


ఈ చిత్రం లో 5  ఫైట్స్ ఉంటాయి.'ఆఫీసర్, సర్కార్3  చిత్ర లకు సంగీతాన్ని అందించిన రవిశంకర్ ఆర్ ఆర్ మా చిత్రానికి ప్రధాన ఆకర్షణ' అని అన్నారు.   చిత్ర నిర్మాత  సందీప్ మాట్లాడుతూ కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది.ఎగ్జికుటివ్ ప్రొడ్యూసర్  అడా రి  మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా పాస్ట్ గా తెర కేకించాం.


జులై లో ఈ చిత్రాన్ని  విడుదల చేయనున్నాం.' అన్నారు.ఈ చిత్రానికి కెమెరా:ఎస్. రామకృష్ణ, ఎడిటర్:జె. పి, ఆర్ ఆర్ :రవిశంకర్,ఎగజిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆడా రి మూర్తి, నిర్మాత,:చెరుకూరి సందీప్, దర్సకత్వం:ఆర్. ఎస్. సురేష్


మరింత సమాచారం తెలుసుకోండి: