వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘మహర్షి’ సినిమా విడుదల అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. మహేష్ ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాల్లోకెల్లా మహర్షి సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చి మహేష్ కెరీర్లోనే అనేక రికార్డులు సృష్టించిన సినిమాగా మహేష్ కెరీర్లో నిలిచిపోయింది. వేసవి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం 200 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది.


ప్రస్తుతం వస్తున్న పెద్ద హీరోల సినిమాలు 25 రోజుల్లో థియేటర్ లో ఉంటేనే గగనం అన్నట్టుగా ఉన్న సమయంలో మహేష్ నటించిన ‘మహర్షి’ ఇప్పుడు 200 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకోవడం ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇదే క్రమంలో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ లు ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భీభత్సంగా కలెక్షన్లు సృష్టించడంతో మహేష్ బాబు ఫుల్ జోష్ లో ఉన్నారు.


ఈ సందర్భంగా యాభై రోజులు పూర్తి చేసుకున్న సందర్భంలో 'మహర్షి' సినిమా యూనిట్ ఈనెల 27వ తారీకు న 50 రోజుల ఫంక్షన్ చాలా గ్రాండ్గా నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే జరగబోయే ఈ ఫంక్షన్ కు ఇండస్ట్రీ నుండి చీఫ్ గెస్ట్ గా న్యాచురల్ స్టార్ నాని రాబోతున్నట్లు ఫిలింనగర్ టాక్. ఈ మేరకు ‘మహర్షి’ సినిమా నిర్మాత దిల్ రాజు నాని ని ఒప్పించినట్లు సమాచారం. మొత్తం మీద 50 డేస్ 'మహర్షి' సినిమా వేడుకకు నాని వస్తున్న నేపథ్యంలో నాని ఫ్యాన్స్ మరియు మహేష్ బాబు అభిమానులు పుల్ జోష్ మీద ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: