తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు కేవలం తమిళనాడులో మాత్రమే కాకుండా ఇతర భారతీయ రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోకూడా కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారనే చెప్పాలి. ఇక ఒకానొక సమయంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం, రజిని ముందు మేము నిలబడలేము అని వ్యాఖ్యానించిన సందర్భాలు లేకపోలేదు. అయితే రజినీకాంత్కు సినిమాల తోపాటు అయన అనుసరించే స్టైల్ కు కూడా ఎక్కువమంది ఫ్యాన్స్ ఉంటారు అనే చెప్పాలి. 

రజిని సిగరెట్ తాగే స్టైల్, నడిచే విధానం, ఇక యాక్షన్ మరియు ఫైట్ సీన్స్ లో రజిని మార్క్ సీన్స్ అందరిని ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. ఒక సౌత్ హీరోగా తన సినిమా ప్రయాణాన్ని ప్రారంభించిన రజిని, నేడు ఇండియాలోని బడా హీరోల్లో ఒకరుగా ఎదిగారు. ఇక మనం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, రజినీకాంత్ కూతురు సౌందర్య నేడు తన సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టిన ఒక పోస్ట్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది. 

మ్యాటర్ ఏంటంటే, రజిని కుమార్తె సౌందర్య నేడు రజిని మరియు ఆమె కొడుకైన వేద్ కృష్ణ ల ఫోటోలు కలిపి తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేసింది. అందులో రజిని స్టయిల్లోనే మనవడు వేద్ కృష్ణ కూడా వెనుకకు తిరిగి నిలబడి ఉండడం గమనించవచ్చు. ఆ ఫోటోను షేర్ చేస్తూ, అచ్చం తాతలానే మనవడు కూడా అంటూ ఆ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ తాత మనవళ్ల ఫోటోను నెటిజన్లు మరియు రజిని అభిమానులు విపరీతంగా లైక్ లు, షేర్లతో పరిగెత్తిస్తున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: