తాను ఫలానా హీరోను దృష్టిలో ఉంచుకుని సినిమా చేయనని అంటున్నారు నటి నివేదా థామస్. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందకు రాబోతున్న సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు.
'బ్రోచేవారెవరురా' ఈ సినిమానే చాలా ప్రత్యేకం. ఇది కేవలం సినిమా కాదు. అంతకంటే ఎక్కువ. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా ఇదే అనుకుంటారు. ఈ సినిమా మన సమాజాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. థియేటర్లో కూర్చున్నప్పుడు ‘నిజంగానే సినిమా చూస్తున్నామా?’ అనిపిస్తుంది.
దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమాలో ఏ నటిని ఎంపికచేసుకోవాలనుకున్నా ముందు వారికి క్లాసికల్ డ్యాన్స్ వచ్చి ఉండాలి అనుకున్నారు. నాకు డ్యాన్స్లో పట్టు ఉంది కాబట్టి నన్ను ఓకే చేశారు. మన ఇండస్ట్రీలో డ్యాన్స్ వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలా ఆలోచిస్తే నేను ఈ సినిమాలో నటించాలని రాసిపెట్టుంది అని చెప్పాలి.
‘బ్రోచేవారెవరురా’ సినిమా తెలుగే కదండీ.. కాకపోతే చిత్రీకరణ ఆలస్యమవుతుండడంతో ఎక్కువ సినిమాలకు సంతకం చేయలేకపోతున్నాను. కానీ ‘బ్రోచేవారెవరురా’లాంటి సినిమా వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకూడదు. ఇలాంటి స్క్రిప్ట్స్ మళ్లీ వస్తాయో లేదో చెప్పలేను. ఇలాంటి సినిమాల కోసం ఎన్నాళ్లయినా వర్క్ చేస్తాను. అని పేర్కొన్నారు.