సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌ను ఆయ‌న మ‌న‌వ‌డు వేద్ అనుసరిస్తున్నాడు. ఈ విష‌యాన్ని చెప్పింది ఎవ‌రో కాదు.. ర‌జ‌నీకాంత్ కుమార్తె సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్‌. ర‌జ‌నీని వేద్ ఇమిటేట్ చేసేలా ఉన్న ఫోటోను సౌంద‌ర్య ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. అద్భుతంగ ఉందని అభిమానులు చెప్తున్నారు.

 

ఈ ఫోటోకు నెటిజ‌న్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. అయితే ఆమె `తాత‌లాగే మ‌న‌వ‌డు` అనే క్యాప్ష‌న్‌ను కూడా ఈ ఫోటోకు ఇచ్చారు. ఈ క్యాప్ష‌న్‌పై మాత్రం నెటిజ‌న్స్ సంతృప్తిగా లేర‌ట‌. `ప్లీజ్ మేడ‌మ్ ర‌జ‌నీకాంత్‌ను తాత అన‌కండి` అని సౌంద‌ర్య‌కు మెసేజ్‌లు పోస్ట్ చేశారు.

 

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్‌, ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న `ద‌ర్బార్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా నివేదా థామ‌స్ కీల‌క పాత్ర‌ధారిగా న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

 

రజనీకాంత్, తాను చేసే ప్రతి సినిమా... తెలుగు డబ్బింగ్ వెర్సన్, మరియు డైలాగులు స్వయంగా తానే పర్యవేక్షిస్తారట! అతనికి తెలుగు వారన్నా, తెలుగు భాషన్నా చాల మక్కువ ఎక్కువని వారి కుటుంబ సభ్యులే  స్వయంగా చెప్పడం కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: