బ్రోచేవారెవరురా సినిమా మరో 3 రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై కాస్త హైప్ ఉంది కానీ సామాన్య ప్రేక్షకులు మాత్రం దీన్ని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. శ్రీ విష్ణు కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. అందుకు తగ్గట్టే థియేట్రికల్ బిజినెస్ అంతంతమాత్రంగానే జరిగింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ సినిమాకు బంపర్ ఆఫర్ తగిలింది. నిజంగా ఇది చిత్ర బృందం కూడా ఊహించనిది. విడుదలకు ముందే బ్రోచేవారెవరురా సినిమా శాటిలైట్ డీల్ లాక్ అయింది. ఏకంగా 3 కోట్ల రూపాయలకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయినట్టు లేటెస్ట్ న్యూస్. ఈ చిన్న సినిమాకు రిలీజ్ కు ముందే ఇంత బిజినెస్ జరగడం నిజంగా గొప్ప విషయం. 


మరీ ముఖ్యంగా శ్రీవిష్ణు సినిమా ఇలా విడుదలకు ముందే శాటిలైట్ రైట్స్ కి ఇంత మొత్తం రావడం ఇదే మొదటిసారి. ఇక ఇప్పటికీ శ్రీవిష్ణు నటించిన ఎన్నో సినిమాలు శాటిలైట్ కు నోచుకోకుండా అలా పక్కనే పడి ఉన్నాయి. ఎంతోకొంతకు అమ్ముకుందామన్నా కొనే దిక్కు లేదు. అలాంటి టైమ్ లో శ్రీవిష్ణు లేటెస్ట్‌గా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే ఇలా అమ్ముడుపోయిందంటే అది చెప్పుకోదగ్గ విషయమే కదా. 


అయితే ఈ సినిమాలో నివేదా థామస్ హీరోయిన్‌గా నటించింది. అందుకే ఈ సినిమా శాటిలైట్ త్వరగా క్లోజ్ అయిందని కూడా సమాచారం. థియేట్రికల్ ట్రయిలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు.. రీసెంట్ గా రిలీజైన కామెడీ టీజర్ క్లిక్ అవ్వడంతో ఈ సినిమా ఇంత తొందరగా అమ్ముడుపోయినట్టు ఒక వర్గం చెబుతున్నారు. ఇక వివేక్ ఆత్రేయ డైరక్ట్ చేసిన బ్రోచేవారెవరురా ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: