సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ మాస్ ఎంటర్ టైనర్‌కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ సినిమాల ఇన్స్పిరేషన్ అని వదంతులు వస్తుండగానే మళ్ళి ఈ సినిమా మీద సడెన్ గా ఓ గాసిప్ గుప్పుమంది. మహేష్ బాబు సినిమాకోసం విదేశీ టీమ్ ను యాక్షన్ సీన్ల కోసం తీసుకువస్తున్నారని, వాళ్లతో మహేష్ కు ట్రయినింగ్ వుంటుందని, ఆ యాక్షన్ సీన్స్ కూడా సాహో రేంజ్‌లో ఉండబోతున్నాయని ఆ గాసిప్ సారాంశం.  


కానీ డైరక్టర్ అనిల్ రావిపూడి ఈ గాసిప్ చూసి రివర్స్‌లో రియాక్ట్ అయ్యాడట. ఇదంతా ఫేక్ అని, తన సినిమాకు ఏ విదేశీ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ పనిచేయడం లేదని, రామ్ లక్ష్మణ్ మాస్టర్ నే పని చేస్తారని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చినట్లు అప్‌డేట్. అంతేకాదు, మహేష్ కు ఏ ట్రయినింగ్ వుండదని, కాశ్మీర్ వెళ్లాక అక్కడ ఆర్మీ టీమ్ కి మాత్రం ఓ ఎపిసోడ్ కోసం శిక్షణ ఇస్తామని అది కూడా జస్ట్ 2-3 డేస్ అని సమాచారం. 


కాశ్మీర్ లో ఓ రెస్క్యూ ఆపరేషన్ సీన్, హీరో క్యారెక్టరైజేషన్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాంటివి చిత్రీకరిస్తారని తెలుస్తోంది. కాశ్మీర్, సోనామార్గ్, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో రెండు వారాలకు పైగా షూట్ చేసాక, హైదరాబాద్ వచ్చి ఇక్కడ 20 రోజుల షెడ్యూలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి నిర్మిస్తుండగా 2020 సంక్రాంతి విడుదలకు రెడీ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: