మన దర్శకులు ఒకేసారి ఏదో హాలీవుడ్ సినిమా చూస్తారు. అందులో ఒక పాయింట్ మనవాళ్ళకు కామన్ గా నచ్చుతుంది. అంతే ఇక ఆగకుండా అదే పాయింట్ చుట్టూ కొత్తగా మరో కథ అల్లుకుంటారు. అలా ఒకే పాయింట్ తో వచ్చిన తెలుగు సినిమాలు ఈమధ్య కాలంలో వచ్చిన మాట వాస్తవమే. ఇప్పుడిదే కోవలో మరో రెండు సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాలే బుర్రకథ, ఇస్మార్ట్ శంకర్. ఆది సాయి కుమార్ నటించిన బుర్రకథ, రామ్ పోతినేని నటిస్తున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో బేసిక్ స్టోరీ పాయింట్ దాదాపు ఒకేటే అనే ప్రచారం తెలుగు ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. బుర్రకథలో హీరోకు రెండు మెదళ్లు ఉంటాయి. ఎప్పుడు ఏ మెదడు పనిచేస్తే, ఆ వ్యక్తిలా మారిపోతుంటాడు హీరో. 


దాదాపు ఇదే పాయింట్ ను డబుల్ దిమాక్ గా మార్చి ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాను పూరి జగన్నాథ్ తీస్తున్నాడు. బుర్రకథలో హీరో క్యారెక్టర్ ఏంటనే విషయాన్ని మేకర్స్ ఓపెన్ గా చెబుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ విషయానికొచ్చేసరికి మాత్రం అసలు విషయం దాచేస్తున్నారు. హీరో మాస్ లుక్, అతడి తెలంగాణ యాసను మాత్రమే ఎక్కువగా చూపిస్తున్నారు. 
కానీ ఇస్మార్ట్ శంకర్ ఒక సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా అనే విషయం ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. అయితే రిలీజ్ కు ముందు స్టోరీలైన్ ను దాచిపెట్టడం పూరికి కొత్తకాదు కదా. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు. 


కానీ ఈ రెండు సినిమాల లైన్ మాత్రం దాదాపు ఒకటే అని టాక్. ఇక బుర్రకథ సినిమా ఈనెల 28న విడుదలవుతోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాను వచ్చేనెల 18న విడుదల చేయబోతున్నారు. సో.. ఈ రెండు సినిమాల్లో ఏదైనా కామన్ పాయింట్ ఉంటే మాత్రం అది పూరి జగన్నాథ్ పై కచ్చితంగా ప్రభావం చూపిస్తుందని ఫిల్మ్ నగర్‌లో టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాలు రిలీజైతే గాని అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: