అక్కినేని నాగార్జున, అమల జంటగా టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘శివ’. ఈ సినిమా వర్మకు తొలి తెలుగు డెబ్యూ మూవి. ఇక ఈ సినిమా ఏ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అయ్యిందో..? 28 ఏళ్ల క్రితం ఎన్నిసినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసిందో.. ట్రెండ్ ఏ రేంజ్‌లో సృష్టించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.


'శివ' సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో హిందీ వెర్షన్‌లోనూ తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో మాస్‌ సినిమాల దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నటించారన్న ఇప్పుడు ఇండస్ట్రీలో ఫ్రెష్ అప్‌డేట్. ఇదేంటి.. ఈ సినిమా ఎన్నోసార్లు చూశాం ఎక్కడా కనిపించలేదే అనుకుంటున్నారు కదా..! అవును ఇది నిజమే ఫేక్ న్యూస్ మాత్రం కాదు. ఈ విషయం ఈ సినిమా తెరకెక్కించిన ఆర్జీవీనే చెప్పాడం విశేషం. అయితే ఈ విషయాన్ని జనాలు నమ్ముతారో నమ్మరో అని దీనికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా పోస్ట్ చేశారు వర్మ.


ఒక్కసారి గనక ఆర్జీవీ ట్విట్టర్ ఖాతాలోకి వెళ్లి వీడియో క్లిక్ చేస్తే.. అందులో డ్యాన్స్ చేస్తూ బ్లూ షర్టులో కనిపించే వ్యక్తిని కాస్త క్లియర్‌గా చూస్తే పూరీనా కాదా అన్న విషయం మీకే తెలిసిపోతుంది. అంతేకాదు 'టాలెంట్‌ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి దర్శకుడు పూరీ జగన్నాథ్‌ నిదర్శనం' అంటూ ఆర్జీవీ తన ట్విట్ట్‌ర్‌ వేదికగా తన శిష్యుడైన పూరీని అభినందించడం కూడా కనిపిస్తుంది. ఇక ఈ ట్వీట్‌కు స్పందించిన పూరీ.. ఎస్..సార్ అంటూ నవ్వుతూ..నమస్కరిస్తున్న ఎమోజీలను పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ ట్వీట్ చూసిన ఆర్జీవీ, పూరీ జగన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. అందరు పూరీ నాగ చైతన్య నటించిన ఏం మాయ చేశావే లో ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించారని అనుకుంటారు. కానీ కాదని ఇప్పుడర్థమవుతుందా..! 


మరింత సమాచారం తెలుసుకోండి: