తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు రామ్ గోపాల్ వర్మ. సంచలనాలకు మారు పేరు. వివాదాల వర్మ అని కూడా పిలుస్తుంటారు.  వర్మ గారు ప్రతీ విషయం పై తన అభిప్రాయాల్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తారు. ఆయన తీసే సినిమాలే కాదు మాట్లాడే మాటలు కూడా వివాదమే. ఒక్కోసారి పొగుడుతుంటారు. ఒక్కోసారి విమర్శిస్తుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన ఒక దర్శకుడి గురించి చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.

 

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ , రామ్ గోపాల్ వర్మ ల  మధ్య ఉన్న అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. వర్మ స్కూల్ నుంచి వచ్చిన పూరి జగన్నాథ్... ఆ తర్వాత టాప్ డైరెక్టర్ గా ఎదిగారు.తాజాగా జగన్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వర్మ ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. నాగార్జున, వర్మ కాంబినేషన్ లో వచ్చిన 'శివ' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూరి జగన్నాథ్ కూడా కనిపించారు.

 

ఈ సినిమాలో 'బోటనీ పాఠముంది... మేటనీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా' అనే సాంగ్ చాలా హిట్ అయింది. ఇందులో పూరి జగన్నాథ్ కూడా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన వర్మ... బ్లూ షర్ట్ లో కనిపించే జూనియర్ ఆర్టిస్ట్... ఈ నాటి సూపర్ డైరెక్టర్ పూరి జగన్ అని తెలిపారు. 'హేయ్ పూరి... వాట్ ఏ జర్నీ' అంటూ కితాబిచ్చారు.

 

అంతే కాకుండా టాలెంట్ ఉంటే జీవితంలో పైకి రావచ్చు అని దానికి ఉదాహరణ పూరి జగన్నథ్ అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ కు స్పందించిన పూరి జగన్నాథ్... 'యస్ సార్' అంటూ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం వరుస ఫ్లాపులతో ఇబ్బందుల్లో ఉన్న పూరి ఎనర్జిటిక్ స్టార్ " రామ్" హీరోగా "ఇస్మార్ట్ శంకర్" సినిమా తీస్తున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది.  పూరి కనెక్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ కి జోడీగా నభ నటేష్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: