జబర్దస్త్ యాంకర్ అనసూయకు అదృష్టం ఫెవికాల్ అంటుకున్నట్టు అంటుకుంది.  జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న ఈ యాంకరమ్మ.. ఇప్పుడు వరసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యింది.  క్షణం, రంగస్థలం, యాత్ర సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. 


ముఖ్యంగా రంగస్థలం.  రంగమ్మత్త పాత్రతో అనసూయకు మైలేజ్ పెరిగింది.  ప్రస్తుతం కథనం అనే సినిమా చేస్తున్నది.  అలాగే మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల సినిమా కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో అనసూయ ఓ కీ రోల్ చేస్తున్నది.  ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు.  


మరోవైపు నాగార్జున బంగార్రాజు సినిమాలో కూడా అనసూయను తీసుకుంటున్నారని తెలుస్తోంది.  గతంలో సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో ఓ చిన్న పాత్ర చేసింది.  మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఇలా మెగాస్టార్.. యువసామ్రాట్ సినిమాల్లో ఆఫర్లు రావడంతో రెండు సినిమాలు చేయడానికి సమయం సరిపోతుంది.  


అందుకే కొన్ని రోజులు జబర్దస్త్ ను పక్కన పెట్టాలని అనసూయ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.  కొన్ని రోజులు దీనిని పక్కన పెట్టి పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెడితే.. ఈ రెండు పూర్తవుతాయి.  ఆ తరువాత సమయం ఉంటె జబర్దస్త్ కంటిన్యూ చేస్తుంది.  లేదంటే సినిమాల్లో బిజీ అవుతుంది.  అంతేకదా మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: