‘నేల టిక్కెట్టు’ తర్వాత క‌ల్యాణ్ కృష్ణ  చేస్తున్న చిత్రం అక్కినేని నాగార్జునతో ‘బంగార్రాజు’ . నేల టిక్కెట్టు విడుదల తర్వాత నాగార్జున‌ని కలిసి ఆ సినిమా వర్క్‌ స్టార్ట్ చేస్తాను’’ అని తెలిపారు. ఇక‌పోతే నాగార్జున, నాగచైతన్య నిజజీవితంలో తండ్రీ కొడుకులు. కానీ చూడ్డానికి మాత్రం అన్నదమ్ముల్లా ఉంటారని అక్కినేని అభిమానులు సరదాగా చెప్పుకుంటుంటారు. ఇప్పుడు నాగార్జున, నాగచైతన్య తాతామనవళ్లుగా నటించబోతున్నారు. రెండేళ్ల క్రితం కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున చేసిన బంగార్రాజు క్యారెక్టర్‌ ఆడియన్స్‌ను బాగా మెప్పించింది. ఇప్పుడు సేమ్‌ కాంబినేషన్‌లోనే ‘సోగ్గాడే చిన్ని నాయానా’ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కనుంది.


 నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే 'బంగార్రాజు' చిత్రంలో చైతన్య కూడా ఓ పాత్ర పోషిస్తున్నారు.  అక్కినేని నాగ చైతన్య సరసన కీర్తి సురేశ్ జతకట్టనుంది. ఇందులో అతని సరసన కీర్తిని తీసుకుంటున్నారట. ఏది ఏమైనా క‌రెక్ట్‌గా చెప్పాలంటే తండ్రిలో ఉన్నంత ఉత్సాహం కొడుకుల్లో మాత్రం క‌న‌బ‌డ‌డం లేద‌నే చెప్పాలి. ఒక‌ర‌కంగా చైతూ కాస్త ప‌ర్వాలేదు కాని అఖిల్ ప‌రిస్థితి కొంచం ఇబ్బందిక‌రంగా ఉంది. 

ఇదిలా ఉండ‌గా నాగార్జున మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఇప్ప‌టికీ న‌వ మ‌న్మ‌ధుడులాగా సినిమాల పైన సినిమాలు చేసుకువెళుతున్నారు. కొడుకులకు ఏమాత్రం తీసిపోకుండా వాళ్ళకు పోటీగా సినిమాలు చెయ్య‌డ‌మేకాక అవి హిట్లు కూడా కొడుతున్నాయి. అదేవిధంగా బంగార్రాజు, మ‌న్య‌ధుడు 2 హిట్ కావాల‌ని ఆశిద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: