మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితగాథ ఆధారంగా రూపొందుతున్న సైరా నరసింహరెడ్డి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రెండురోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయింది. ఇక దీని తరువాత అయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నారు. ఒక మంచి సామజిక అంశాన్ని తీసుకుని దానిని ప్రేక్షకులకు ఎంటర్టైనింగ్ గా చూపించేందుకు కొరటాల సిద్ధమయినట్లు సమాచారం. 

ఇక ఇప్పటివరకు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మనం చూసుకుంటే, మొదటి సినిమా మిర్చి నుండి మొన్నటి భరత్ అనే నేను వరకు అన్నీ మెసేజి ఓరియెంటెడ్ మూవీసే. ఇక మెగాస్టార్ తో చేయబోయే ఈ సినిమాకూడా అదే తరహాలో ఉండబోతుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ గురించిన ఇతర వివరాలేవీ ఇప్పటివరకు అధికారికంగా  వెల్లడి కానప్పటికీ, ఈ మూవీని మాత్రం మెగాస్టార్ కెరీర్ లో గుర్తుండిపోయేలా ఎంతో గ్రాండ్ గా తీయాలని సంకల్పించారట దర్శకనిర్మాతలు, 

అందుకోసమే సినిమాకు భారీలెవెల్లో ఖర్చుపెట్టేందుకు సిద్ధమయినట్లు సమాచారం. ఇకపోతే మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఇందులో వుంటాయని, అలానే ఈ సినిమా తరువాత అయన ఇమేజి మరింత పెరుగుతుందని అంటున్నారు. ఎంతైనా మెగాస్టార్ ఓవైపు, ఇప్పటివరకు ఒక అపజయం ఎరుగని దర్శకుడు మరోవైపు ఉన్నారు కాబట్టి, ఈ మూవీకి ఆ మాత్రం హై రేంజిలో ఖర్చుపెట్టవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!   


మరింత సమాచారం తెలుసుకోండి: