గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ తర్వాత బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ నటించిన ‘వినయ విదేయ రామా’ సినిమాలో నటించింది.  మొదటి సినిమా మంచి హిట్ అయినా..రాంచరణ్ సినిమాతో ఢీలా పడిపోయింది. 

తెలుగు లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కి రంగ ప్రేవేశం చేసింది. ఈ మద్య అర్జున్ రెడ్డి రిమేక్ ‘కబీర్ సింగ్’సినిమాలో నటించిన కియారా కి బాగా కలిసి వచ్చింది.  ఈ మూవీ ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరింది.   ఈ మూవీతో కియారా బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. సాధారంగా తెలుగు, తమిళ బాషల్లో ఛాన్స్ వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తుంటారు.

ఇక్కడ బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కలిసి వస్తే తెలుగు, తమిళ వైపు చూడరన్న విషయం తెలిసిందే.  కానీ వారికి భిన్నంగా కియారా మాత్రం ఏడాదికి ఒక సౌత్ సినిమా చేయాలని నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం కియారా గుడ్ న్యూస్, లక్ష్మి బాంబ్, షేర్ షా, ఇందూ కి జవానీ సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్‌లో బిజీగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: