ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా నయనతార హీరోయిన్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ సైరా నరసింహా రెడ్డి. తొలిసారి ఒక స్వాతంత్రోద్యమ యోధుడిపాత్రలో ఒక విభిన్నమైన క్యారెక్టర్ లో నటిస్తున్న మెగాస్టార్, తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చి, మంచి సక్సెస్ సాదిస్తుందని అంటున్నారట. ఇకపోతే దాదాపుగా రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, 

తమిళ నటుడు విజయ్ సేతుపతి, టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు, కన్నడ నటుడు సుదీప్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక జేజమ్మ అనుష్క కూడా ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటిష్తోంది. అయితే ఆమె నటిస్తున్న పాత్ర పై నేడు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త ప్రచారం అవుతోంది. దానిప్రకారం, ఈ సైరా సినిమాలో మరొక్కసారి అనుష్క ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోందని, అలానే ఈ సినిమాలో ఆమె కత్తి పట్టి యుద్ధం చేసే కొన్ని సీన్లు కూడా ఉన్నట్లు సమాచారం. 

అయితే వాటికోసం అనుష్క కొంత ట్రైనింగ్ కూడా తీసుకుందని అంటున్నారు. ఇటీవల ఆమెపై చిత్రీకరించిన షాట్స్ ఎంతో అద్భుతంగా వచ్చాయని, రేపు సినిమా విడుదల తరువాత మిగతా క్యారెక్టర్స్ మాదిరే అనుష్కకు కూడా మంచి పేరొస్తుందని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఒకవేళ ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, అనుష్క ఫ్యాన్స్ కు ఇది పండుగ వార్తే అని చెప్పుకోవచ్చు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: