ప్రస్తుతం చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా డబ్బింగ్ చెబుతూ బిజీ బిజీగా ఉన్నారు. చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై మెగా అభిమానులు బీభత్సంగా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాకి చిరంజీవి ఎక్కువ సమయం కేటాయించడం తో తన తదుపరి సినిమా కొరటాల తో చేయబోయే సినిమా విషయంలో చాలా స్పీడ్ గా ఉన్నారు.


ఇప్పటికే కొరటాల శివ చిరంజీవి తో చేయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభించడానికి అన్ని విధాల రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటువంటి క్రమంలో ఈ సినిమాలో చిరంజీవి పక్కన హీరోయిన్ గా గతంలో అనుష్క, నయనతార, శృతిహాసన్ వంటి అనేక పేర్లు వినపడ్డాయి. అయితే తాజాగా ఈ సినిమాలో చిరంజీవి లుక్ వయస్సు తగ్గినట్లు గా ఉండబోతున్న క్రమంలో చిరంజీవి పక్కన కొత్త ముఖం కనబడాలని హీరోయిన్ కోసం డైరెక్టర్ కొరటాల సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


గతంలో మహేష్ బాబు నీ డైరెక్ట్ చేసిన సమయంలో భరత్ అనే నేను లో మహేష్ బాబు పక్కన కియారా అద్వానీ అనే కొత్త హీరోయిన్ ని పెట్టి బంపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే ఫార్ములాను చిరంజీవి సినిమా విషయంలో కూడా వాడాలని కొరటాల ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని ఎలాగైనా త్వరగా పూర్తి చేసి రానున్న ఉగాదికి విడుదల చేయాలని షూటింగ్ కోసం సినిమా యూనిట్ పక్కా ప్రణాళికలు వేసినట్లు సమాచారం.  



మరింత సమాచారం తెలుసుకోండి: