ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ గా నిలిచిన సినిమాల్లో అన్నిటికంటే ముందువరుసలో ఉన్నవి బాహుబలి సిరీస్ లో వచ్చిన బాహుబలి 1,2  సినిమాలు మాత్రమే. ఇక ఆంధ్ర మరియు తెలంగాణలోని దాదాపుగా అన్నిచోట్లా ఇప్పటికీ రికార్డుల పరంగా ఈ రెండు సినిమాలే ఒకటి, రెండు స్థానాలు ఆక్రమించాయి. దర్శకధీరుడు రాజమౌళి అద్భుత దర్శకత్వ ప్రతిభ, ప్రభాస్ బాహుబలిగా ఆడియన్స్ ని అలరించిన తీరు, వెరసి ఆ రెండు సినిమాలను అంత పెద్ద హిట్ చేసాయి. ఇకపోతే నైజాం, ఓవర్సీస్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఈ రికార్డులను ఇప్పట్లో బద్దలుకొట్టే అవకాశం అయితే కనపడడం లేదంటున్నారు విశ్లేషకులు. 

అయితే రేపు రాబోయే ప్రభాస్ సాహో కానీ లేదా వచ్చే ఏడాది ఆర్ఆర్ఆర్ కానీ వాటిని బద్దలుకొట్టే ఛాన్స్ ఉందని, కానీ ఆ రెండు సినిమాలకు సూపర్ హిట్ టాక్ రావాలని, అయితే వచ్చినప్పటికీ కూడా బాహుబలి 1 రికార్డ్స్ అయితే మిగలవు కానీ, బాహుబలి 2 రికార్డ్స్ ని అందుకోవడం మాత్రం ఒకింత కష్టం అంటున్నారు. ఇక ఆ రెండు సినిమాల రికార్డులను అందుకోగల ఒకే ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఉందని నేడు టాలీవుడ్ వర్గాల్లో ఒక చర్చ నడుస్తోంది. అదేమిటంటే, ఆ మధ్య త్రివిక్రమ్ అతి త్వరలో మహేష్, పవన్ తో కలిసి ఒక భారీ మల్టి స్టారర్ ప్లాన్ చేసారని, అతి త్వరలో వారిద్దరికీ కథ వినిపించి దానిని తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమాపై అటు మహేష్, ఇటు పవన్ కానీ, లేదా త్రివిక్రమ్ కానీ ఇప్పటివరకు నోరు విప్పలేదు. 

ఒకవేళ ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లు ఒక వేళ ఆ సినిమా కనుక కార్యరూపం దాల్చి పట్టాలెక్కితే, ఇక దానికి తిరుగు ఉండదని, దానితో ఇప్పటివరకు బాహుబలి రెండు సినిమాల పేరుమీద ఉన్న రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయమని అంటున్నారు. అయితే ఇది కేవలం ప్రచార వార్త మాత్రమే అని, త్రివిక్రమ్ తన సినిమాల్లో, మహేష్ తన కెరీర్ తో, అలానే పవన్ తన రాజీకీయాల్లో ముగ్గురూ ఎవరికీ వారు బిజీ అవ్వడంతో ఈ సినిమా అసలు ఇప్పట్లో ఉండే అవకాశం మాత్రం కనపడడం లేదనేది సినిమా విశ్లేషకులు చెప్తున్న మాట. మరి ఎప్పటినుండో సూపర్ స్టార్, పవర్ స్టార్ ఫ్యాన్స్ కలలుకంటున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ అసలు ఉంటుందో లేదో అనేది రాబోయే రోజుల్లో కానీ తెలియదు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: