టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకు పోతున్న హీరోయిన్ సమంత తాజాగా ‘ఓ బేబీ’ మూవీతో వచ్చే నెల 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. వివాహం అనంతరం సమంత కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు..ప్రయోగాలు కూడా చేస్తుంది.
ఆ మద్య మహనటిలో నత్తి పాత్ర, రంగస్థలం మూవీలో పల్లెటూరి అమ్మాయిగా సహజన నటన ఉండేవిధంగా నటిస్తుంది. ప్రస్తుతం ఓ బేబీ ప్రమోషన్ వర్క్ బిజీలో ఉన్నారు చిత్ర యూనిట్. తాజాగా ఈ మూవీలో ధన్ రాజ్ ని నిజంగానే కొట్టినట్లు కనిపిస్తుంది అన్న ప్రశ్నకు నవ్వూతూ అవును నిజంగానే కొట్టాను..కాకపోతే అది నిజం కాదు. ఆ సమయంలో నేను పాత్రలో బాగా లీనమైపోయాను..అందువలన అలా నిజంగానే కొట్టేశాను" అన్నారు.
నాకు ఏ సీన్ అయినా పర్ఫెక్ట్ గా ఉండాలనే చూస్తాను..డైరెక్టర్ చెప్పింది ఆయనకు నచ్చినా..వందసార్లు నచ్చిందా అని అడుగుతాను. ఒక పట్టాన నేను సంతృప్తి చెందను .. సంతోష పడిపోను. టీజర్ బాగా వచ్చిందంటే .. ట్రైలర్ ఇంకా బాగా రావాలని చెబుతాను. ట్రైలర్ బాగా వచ్చిందంటే ఇక మూవీపై రిజల్ట్ గురించి ఆలోచిస్తానని అన్నారు సమంత.