భారత్ బాడ్మింటన్ సంచలనం పీవీ సింధు హోట‌ల్ బిల్‌ను ఓ హీరో సీక్రెట్‌గా క‌ట్టేశాడు. సింధు హోట‌ల్ బిల్లేంటి... టాలీవుడ్ హీరో సీక్రెట్‌గా క‌ట్ట‌డం ఏంట‌న్న అనుమానం రాక మాన‌దు. పీవీ సింధు మరో మహిళ యూఎస్ కౌన్సిల్ జనరల్ క్యాథరిన్ హడ్డాతో కలిసి ఓ ఫేమ‌స్ హోట‌ల్లో లంచ్ చేసింది. ఆ టైంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు అక్క‌డే ఉన్నారు.


విష్ణు వెంట‌నే సింధు బిల్ చెల్లించేసి వారిని స‌డెన్‌గా స‌ర్‌ఫ్రైజ్ చేసేశారు. ఈ విష‌యాన్ని సింధు త‌న ట్వీట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేశారు. విష్ణును క‌ల‌వ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని... మా బిల్ చెల్లించినందుకు మీకు కృత‌జ్ఞ‌త‌లు అని చెప్ప‌డంతో పాటు విష్ణుతో ఉన్న ఫొటో కూడా ట్వీట్ చేసింది.


ఈ ట్వీట్‌పై విష్ణు కూడా రిప్లే ఇచ్చాడు. మీ లాంటి ల‌వ్లీ లేడీస్‌తో క‌లిసి లంచ్ చేసి బిల్ చెల్లించ‌డం త‌న అదృష్ట‌మ‌న్నాడు. ఆడ‌వారి చేత బిల్ క‌ట్టించ‌డం పురుష ల‌క్ష‌ణం కాద‌ని... సింధు నువ్వు చాలా పొడ‌గ‌రి అంటూ ట్వీటాడు. ఇదిలా ఉంటే పీవీ.సింధు బ‌యోపిక్ త్వ‌ర‌లో తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. 


ప్ర‌ముఖ బాలీవుడ్ విల‌న్ సోనూసూద్ నిర్మించే ఈ సినిమాలో సింధు పాత్ర బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌డుకొనే చేస్తున్న‌ట్టు స‌మాచారం. దీనిపై త్వ‌ర‌లోనూ క్లారిటీ రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: