తెలుగులో సంచలనం సృష్టించిన "అర్జున్ రెడ్డి" హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. 100 కోట్ల దిశగా వెళ్తుంది. అయితే ఈ సినిమా మీద ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కలెక్షన్ల మీద ఎటువంటి ప్రభావం లేదు. షాహిద్ కపూర్ నటన పీక్స్ అంటూ అందరూ పొగుడుతున్నారు.

 

కథ ఎలా ఉన్నా డైరెక్టర్ విజన్ - హీరో యాక్టింగ్ పై సినిమా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. తెలుగులో హిందీలో అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యింది.  షాహిద్ కపూర్ సోలో హీరోగా 100 కోట్ల క్లబ్ లో చేరబోతున్న మొదటి సినిమాగా రికార్డు సృష్టించనుంది. ఈ సినిమా విజయంతో అందరూ సందీప్ ని పొగుడుతున్నారు. తమిళ హీరో చియాన్ విక్రమ్ సందీప్ ని ఒక రిక్వెస్త్ చేసాడట.

 

ఈ సినిమాని  చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా కోలీవుడ్ లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి మొదటగా బాలా దర్శకత్వం వహించగా, ఆ ఫుటేజి సరిగా రాలేదని, మొత్తం క్యాన్సల్ చేసి మళ్ళీ కొత్త దర్శకుడు అయిన గిరిశాయ చేత తెరెకెక్కించారు. ఈ  సినిమాకి ఆదిత్య వర్మ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు. "ఆదిత్య వర్మ" టీజర్ మొన్న రిలీజ్ అయింది.

 

ఈ టీజర్ కి మంచి స్పందన లభించింది.అయితే ఇప్పుడు బాలీవుడ్ లో సందీప్ వంగ డైరక్ట్ చేసిన కబీర్ సింగ్ సాలిడ్ హిట్టవ్వడంతో విక్రమ్ అతన్ని పిలుస్తున్నట్లు సమాచారం. సినిమా మేకింగ్ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూచించినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: