వరుసగా ఆరు సినిమాల ఫ్లాపుల తర్వాత "చిత్రలహరి" సినిమాతో విజయాన్ని అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.  జీవితంలో ఫెయిలయ్యే యువకుడి కథతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్  మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

 

ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్ష్న్ పనుల్లో బిజీ గా ఉన్నారు మారుతి గారు. ఈ సినిమాలో ఇద్దరు హీరీయిన్లు ఉన్నారట.  ముఖ్య కథానాయకిగా రాశి ఖన్నా ని తీసుకున్నారు. ఇంకో హీరోయిన్  కోసం వెతుకుతున్నారట. ఫ్యామిలీ డ్రామాల్ని బాగా తీసే మారుతి ఈ సినిమాని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నారట.

 

ఇటీవలే పూజా కార్యక్రమాలు చేసుకుని త్వరలీ సెట్స్ మీదకు వెళ్ళనుంది ఈ సినిమా.ఇది మూడు తరాలకి .. ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన కథ అని అంటున్నారు. తాత .. తండ్రి .. కొడుకు చుట్టూ ఈ కథ తిరుగుతుందని చెబుతున్నారు.తాత పాత్రలో సత్యరాజ్ .. తండ్రి పాత్రలో రావు రమేశ్ .. కొడుకు పాత్రలో సాయిధరమ్ తేజ్ కనిపించనున్నారు.

 

ఈ మూడు పాత్రలను చాలా భిన్నంగా .. బలంగా తీర్చిదిద్దినట్టుగా సమాచారం. గీతా ఆర్ట్స్ 2 - యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.  కామెడీతో పాటు ఎమోషన్ కి పెద్దపీట వేసిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో వున్నారు.  చిత్రలహరి సినిమాతో విజయం సొంతం చేసుకున్న సాయి ధరమ్ తేజ్ ఆ విజయాన్ని ఈ సినిమాతో కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: