ఆది సాయికుమార్ - డైమండ్ రత్నం కాంబినేషన్ లో రూపొందిన బుర్రకథ సినిమా ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. సెన్సారు కాకపోవడమే అందుకు కారణమి లేటెస్ట్ అప్‌డేట్. ప్రస్తుతం ఉన్న సెన్సారు అధికారి చాలా స్ట్రిక్ట్ గా వుంటున్నారు. పద్దతులు పాటించకుండా సినిమాలు చూడడంలేదు. ఈవారం కల్కి, బ్రోచేవారెవరురా, బుర్రకథ.. ఈ మూడు సినిమాలు విడుదల కావాల్సి వుండగా రెండే సెన్సారు గండం దాటాయి.


వాటిల్లో కూడా ఓ సినిమాకు కేంద్రం నుంచి కాస్త గట్టి సిఫార్సు రావడంవల్ల పని సాధ్యమైందట. లేదూ అంటే ఈవారంలో రావాల్సిన మూడు సినిమాల్లో రెండు వాయిదాపడేవని సమాచారం. అయితే బుర్రకథ విషయంలో వేరే మాట కూడా వినిపిస్తోంది. ఈ సినిమా కూడా గట్టెక్కే అవకాశం వుండేదని, ఇతర వత్తిడులు వచ్చి, సెన్సారు అధికారి అస్సలు రూల్స్ దాటకుండా, దాని మీదే వుండిపోయారని ఇండస్ట్రీలో గాసిప్ వినిపిస్తోంది. బుర్రకథ టీమ్ ఈ సాయంత్రం 29న విడుదల అని ప్రకటించింది. కానీ అంతలోనే విడుదల డేట్ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.


ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం గురువారం కూడా సెన్సారు అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. అందువల్ల బుర్రకథ వెళ్లి 'ఓ బేబీ', రాజ్ దూత్ సినిమాలతో పోటీపడాల్సి వుంటుందని మరో లేటెస్ట్ న్యూస్. ఈ విధంగా చూస్తే హీరో ఆది టైం అస్సలు బాగోలేదనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో హిట్ మాట ఎరగని ఆది బుర్రకథ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా ఏమో ఇలా జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: