తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన...మంచి నటిగా పేరు తెచ్చుకున్న విజయనిర్మల నిన్న అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ వార్త విన్న తెలుగు చిత్రసీమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. నిన్నటి నుంచి నేటి ఉదయం వరకు ఆమె భౌతిక ఖాయాన్ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకొని నివాళులర్పించారు.
బుధవారం తుది శ్వాస విడిచిన విజయ నిర్మల అంతిమ యాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ నానక్ రామ్ గూడలోని ఆమె నివాసం నుంచి మొదలైన ఈ అంతిమ యాత్రలో బంధులువు, అభిమానుల వందల సంఖ్యలో పాల్గొంటున్నారు. చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్లో విజయ నిర్మల అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నట్లు ఆమె కుమారుడు నరేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు అంతిమ యాత్రలో పాల్గొననున్నారు. మధ్యాహ్న సమయానికి అంత్యక్రియలు ముగించే అవకాశం ఉంది. పోలీసులు విజయకృష్ణ గార్డెన్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.