ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ పూజ హెగ్డే.  ఆ తర్వాత "ఒక లైలా కోసం" లాంటి మంచొ నటనా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన్ డీజే లో నటించి గ్లామ్ర్ హీరోయిన్ గా మార్కులు కొట్టేసింది. అయితే పూజకి అవకాశాలు బాగానే ఉన్నప్పటీకీ విజయాలు మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి.

 

బాలీవుడ్ లో కూడా అరంగేట్రం చేసిన పూజకి అక్కడ కూడా విజయం లభించలేదు.  మొన్న రంగస్థలంలో రామ్ చరణ్ తో స్పెషల్ సాంగ్ చేసి అందరి చూపు తన వైపు తిప్పుకుంది. అయితే ఈ భామ కి అవకాశాలు బానే వస్తున్నాయట. మొన్న వచ్చిన మహర్షి సినిమాలో మహేష్ బాబు కి జోడీగా నటించింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది.

 

టాలీవుడ్ లో ప్రజెంట్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో కూడా పూజనే హీరోయిన్. అలాగే వరుణ్ తేజ్ సరసన హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న "వాల్మీకి " సినిమాలో హీరోయిన్ పూజనే. ఇలా వరుస్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది పూజ హెగ్డే.

 

అయితే బాలీవుడ్ లో కూడా ఈ భామ బిజీ కాబోతుంది. బాలీవుడ్ లో ప్రస్తుతం "హౌస్ ఫుల్" చిత్రంలో నటిస్తుంది. దీనితో పాటు మరో రెండు సినిమాలు కూడా బాలీవుడ్ లో  చేయనుందని సమాచారం. అందులో ఒకటి సునీల్ శెట్టి, జాన్ అబ్రహమ్, ఇమ్రాన్ హష్మీ హీరోలుగా సంజయ్ గుప్తా  దర్శకత్వంలో రూపొందబోతున్న "ముంబయి సాగా"లో హీరీయిన్ గా ఫైనల్ అయిందట. అలాగే మరో సినిమాకి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: