ఈ మద్య వస్తున్న సినిమాలు రిలీజ్ అయ్యే వరకు ఎలాంటి కాంట్రవర్సీలు ఎదుర్కొంటుందో చెప్పలేని పరిస్థితి.  షూటింగ్ మొదలు రిలీజ్ అయ్యే వరకు దర్శక, నిర్మాతలకు కొన్ని విషయాలు తలనొప్పిగా మారుతున్నాయి.  కొన్ని సినిమాలైతే రిలీజ్ కాకముందే నెట్టింట్లో ప్రత్యక్షం కావడం..కొన్ని ముఖ్యమైన సీన్లు లీక్ కావడం ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకొని సెన్సార్ వద్దకు రాగానే అక్కడా కొన్ని చిక్కులు..ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

తాజాగా ఇప్పుడు ఆది సాయికుమార్ నటించిన ‘బుర్రకథ’ విషయంలో ఇలాంటి చిక్కులే ఎదుర్కొంటున్నారు. ఆది సాయికుమార్ హీరోగా రచయిత డైమండ్ రత్నబాబు డైరెక్టర్‌గా మారి తెరకెక్కించిన చిత్రం ‘బుర్రకథ’.  ఈ మూవీలో రెండు మెదళ్లతో పుట్టిన ఓ యువకుడు సమాజంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు అన్న కాన్సెప్ట్ తో ఉండబోతుందట. ఈ మూవీ దీపాల ఆర్ట్స్ బ్యాన‌ర్‌‌పై హెచ్‌ కె.శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. 

ఇక అన్నీ సిద్దం చేసుకొని నేడు రిలీజ్ చేయాలనే అనుకున్నారు..కానీ  సెన్సార్ కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ జూన్ 28 నుంచి జూన్ 29కు షిఫ్ట్ అయిందని నిన్న చిత్ర బృందం వెల్లడించింది. అయితే ఇప్పుడు ఆ డేట్ కి కూడా రిలీజ్ అవుతుందా అంటే డౌటే అంటున్నారు. త్వరలో కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్.  మిస్తీ చక్రబోర్తి , నైరాషాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: