ప్రస్తుతం బుల్లితెరపై ప్రదర్శితం అవుతున్న షోల్లో మంచి పేరు మరియు ప్రేక్షకాభిమానం సంపాదించిన షోల్లో ఈటివి ప్లస్ ఛానల్లో ప్రసారం అయ్యే పటాస్ షో కూడా ఒకటి అనే చెప్పాలి. ఈ షోకి యూత్ మరియు ఫ్యామిలీ లేడీస్ అత్యధికులైన వ్యూయర్స్ గా వుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. అందువల్లనే ఈ షో అంత పాపులరైందని వారు చెపుతున్నారు. అయితే ఈ షోకి శ్రీముఖి యాంకర్ గా ఉండడం కూడా షో కి మంచి రేటింగ్ మరియు వ్యూస్ రావడానికి మరొక బలమైన కారణం అనే చెప్పాలి. ఇదివరకు అక్కడక్కడా కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిసిన శ్రీముఖి, ఈ షో ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. 

అంతేకాదు ప్రస్తుతం బుల్లితెరపై మంచి క్రేజ్ ఉన్న యాంకర్లలో ఆమె కూడా ఒకరు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇకపోతే తాను పటాస్ షో నుండి కొన్ని కారణాల వలన తప్పుకుంటున్నట్లు కొద్దీరోజుల క్రితం స్వయంగా ఒక వీడియో బైట్ ద్వారా తెలియపరచడంతో, శ్రీముఖి అభిమానులు చాలావరకు నిరాశకు గురయ్యారు. అయితే సదరు ఛానల్ యాజమాన్యానికి మరియు శ్రీముఖికి మధ్య కొన్ని అభిప్రాయబేధాలు రావడం వల్లనే ఆమె షో నుండి తప్పుకుందని కొన్ని వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఆమె షో నుండి తప్పుకోవడంపై నేడు మరొక వార్త వైరల్ అవుతోంది. 

అది ఏంటంటే, శ్రీముఖికి త్వరలో స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 3 లో ఒక పార్టిసిపెంట్ గా అవకాశం వచ్చిందని, అందువల్లనే ఆమె అర్ధంతరంగా పటాస్ షో నుండి తప్పుకుందని అంటున్నారు. ఇక యువసామ్రాట్ నాగార్జున ఈ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు ఇప్పటికే చాలావార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒకవేళ బిగ్ బాస్ 3లో శ్రీముఖి నిజంగానే పార్టిసిపేట్ చేస్తే మాత్రం ఆ షో కు మరింత ఆకర్షణ చేకూరినట్లే అని ఘంటాపధంగా చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం పుకారవుతున్న ఈ వార్త అసలు నిజమా, కాదా అనేది మాత్రం శ్రీముఖి నుండి ఆదరికారిక ప్రకటన వస్తేనే గాని తెలియదు....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: