నాన్న పందులే గుంపులు గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది... అనే డైలాగ్ గుర్తుంది కదా.  ఈ డైలాగ్ చెప్పింది ఎవరో కాదు.. రజినీకాంత్.  శివాజీ సినిమాలో డైలాగ్.  శివాజీ ఎలాంటి హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు.  ఈ మూవీ తరువాత శంకర్ తో కలిసి రోబో చేశాడు.  


అది సూపర్ హిట్ అయ్యింది.  ఆ తరువాత 2పాయింట్ 0 తీశాడు.  సినిమా హిట్టయినా అనుకున్నట్టుగా డబ్బులు రాలేదు.  చైనాలో రిలీజ్ చేస్తే తప్పకుండా మరో 500 కోట్లయినా వస్తాయని అనుకున్నారు.  సినిమా రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.  హెచ్ వై మీడియా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యింది.  


జులై 12 వ తేదీన చైనాలోని 60వేల స్క్రీన్స్ లో సినిమాను రిలీజ్ చేయాలి.  అయితే, సడెన్ గా సినిమా రిలీజ్ ను ఆపేశారు.  కారణం జులై 19 వ తేదీన డిస్ని ది లయన్ కింగ్ వస్తున్నది.  1994 లో వచ్చిన లయన్ కింగ్ సినిమాకు రీమేక్ ఇది.  సింహం కథతో సినిమా తెరకెక్కింది.  


ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  డిస్నినుంచి వచ్చిన అల్లాదీన్ సినిమా హిట్ కొట్టడంతో దీనిపై అంచనాలు పెరిగాయి.  బహుశా అందుకే 2పాయింట్ 0 సినిమా రిలీజ్ ను పక్కన పెట్టారని, ది లయన్ కింగ్ సినిమా కలెక్షన్లను తగ్గిపోయిన తరువాత 2పాయింట్ 0 మూవీ రిలీజ్ చేస్తారని అంటున్నారు.  అంటే ఆగష్టు వరకు వెయిట్ చేయాలేమో.  


మరింత సమాచారం తెలుసుకోండి: