బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి, హీరోయిన్ కంగన రనౌత్ మధ్య వివాదం రసవత్తరంగా మారింది. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం, కోర్టులో ఫిర్యాదు నమోదు చేయడం మీడియాలో ప్రముఖంగా మారింది. ఇటీవల పరువు నష్టం కేసులో కంగనను, ఆమె సోదరి రంగోలి చండేల్‌ను కోర్టుకు ఆదిత్య దంపతులు లాగడం తెలిసిందే. దానికి బదులుగా ఆదిత్యపై తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదు చేయడంతో ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారింది.

ఇటీవల పరువు నష్టం దావా కేసులో కంగన రనౌత్, ఆమె సోదరి రంగోలికి ఆదిత్య పంచోలి ఫిర్యాదుతో కోర్టు నోటీసులు పంపింది. గతంలో తన సోదరి కంగనను లైంగికంగా వేధించాడు. గృహనిర్బంధం చేశాడు. రేప్ కూడా చేశాడు. దానికి రుజులు మేము ఇవ్వలేం అంటూ రంగోలి ట్వీట్ల వర్షం కురిపించడంతో ఆదిత్య దంపతులు షాక్ తిన్నారు. దాంతో వారిపై పరువు నష్టం దావా వేశారు.

ఆదిత్య పంపిన నోటీసులకు ప్రతీకారంగా రంగోలి ఆదిత్యపై దారుణమైన ఆరోపణలు చేసింది. కంగనకు ముంబైలో ఇళ్లు లేనప్పుడు ఆశ్రయం కల్పించాడు. మూడు నెలలు భోజనం పెట్టినందుకు వేధించాడు. నా సోదరిని బెదిరించి, ఆమె నుంచి 2007లో కోటి రూపాయలకుపైగా కొట్టేశాడు. అందుకు సంబంధించిన కొన్ని రుజువులను జత చేస్తూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఆదిత్య పంచోలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కాగా ఆదిత్య పంచోలిని టార్గెట్ చేసుకొని రంగోలి చండేల్ ట్వీట్ల వర్షం కురిపించారు. ఆదిత్య మీద ఫిర్యాదు చేసే హక్కు నాకుంది. 2007లో కంగనపై దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కోటికి పైగా డబ్బు తీసుకొని.. ఇంకా కావాలని వేధించాడు. దానికి సంబంధించి ఆదిత్య పంపిన మెసేజ్ నా వద్ద ఉంది అని రంగోలి ఓ ట్వీట్ చేసింది.

తనపై వస్తున్న ఆరోపణలను, దాడులపై సమాధానం ఇవ్వడానికి కంగనకు సమయం లేదు. ఆమె తరఫున అన్ని వ్యవహారాలను తాను చూసుకొంటున్నానని, దానికి ఆమెకు చాలా మనోధైర్యాన్ని కూడగడుతున్నాను. కంగన షూటింగ్‌లతో చాలా బిజీగా ఉన్నారు. అందుకే ఆమె తరఫున కేసులను ఫైల్ చేయాల్సి వస్తున్నది అని కంగన రనౌత్ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: