ప్రస్తుతం బుల్లితెరపై మంచి క్రేజ్ తో దూసుకెళ్తున్న షోల్లో ఈటివి ప్లస్ ఛానల్ లో ప్రసారం అవుతున్న పటాస్ షో కూడా ఒకటి అనే చెప్పాలి. మొదట్లో కొన్ని టెలివిజన్ కార్యక్రమాల్లో అలానే అక్కడక్కడా సినిమాల్లో మెరిసిన ప్రముఖ యాంకర్ శ్రీముఖి, ఈ షో ద్వారానే మంచి పాపులారిటీ సంపాదించారు. 

ఇకపోతే ఈ షోలో శ్రీముఖి, రవి చేసే సందడి అంత ఇంతా కాదు అనే చెప్పాలి. వీక్షకులను ముఖ్యంగా కుర్రకారును బాగా ఆకట్టుకున్న ఈ షో నుండి ఇటీవల అర్ధంతరంగా శ్రీముఖి తప్పుకోవడంతో ప్రస్తుతం ఆమె లేకుండా సాగుతున్న షోకు రేటింగ్స్ మరియు ప్రేక్షకాదరణ కాస్త తగ్గినట్లు సమాచారం. నిజానికి ఈ షోలో పాల్గొనే యాంకర్ రవితో పాటు శ్రీముఖికి కూడా ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారని, అయితే ఆమె షోకు రాకపోవడంతో కొందరు ఆమె అభిమానులు షోను చూడడం మానేయడంతోనే రేటింగ్స్ కూడా తగ్గాయనేది కొందరు విశ్లేషకులు చెప్తున్న మాట. 

అయితే శ్రీముఖ్ బిగ్ బాస్ సీజన్ 3 కోసమే కొన్నాళ్లపాటు పటాస్ నుండి తప్పుకుందని కూడా ప్రస్తుతం వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఆమె ఎందుకోసం పటాస్ నుండి తప్పుకుంది అనే విషయం అటుంచితే, ఈ షోలో ఆమె లేని లోటు మాత్రం కొట్టొచ్చినట్లు కనపడుతుందని, ఇక పూర్వం వలె పటాస్ షో మళ్ళి మంచి ఆదరణ మరియు రేటింగ్స్ సంపాదించాలంటే మాత్రం మళ్ళి శ్రీముఖి రి ఎంట్రీ ఇవ్వాల్సిందే అని అంటున్నారు. మరి అది ఎంతవరకు జరుగుతుందో రాబోయే రోజుల్లో కానీ తెలీదు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: