గత కొద్దికాలంగా భారీ సక్సెస్ లేకుండా తడబాటుకు గురవుతున్న దర్శకుడు మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ అనే ఓ చారిత్రాత్మక చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఆయన బిజీగా ఉంటూ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందనేది చిత్ర యూనిట్ సమాచారం. ఈ క్రమంలోనే నటీనటులు ఎంపికపై దృష్టిపెట్టారు మణిరత్నం.

 

ఇలాంటి పరిస్థితుల్లో మణిరత్నంను ప్రేమమ్ హీరోయిన్, మలయాళ ముద్దుగుమ్మ మడొన్నా సెబాస్టియన్ కలవడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. దాంతో ఆమె పొన్నియన్ సెల్వన్‌ చిత్రంలో నటించనున్నారనే వార్త వైరల్ అయింది. మణిరత్నంను కలిసిన తర్వాత దిగిన సెల్ఫీని మడోన్నా సెబాస్టియన్‌ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటో వైరల్ అయింది.

 

ఈ రోజు నా చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. నేను మాట్లాడను కానీ ఈ ఫొటో మాట్లాడుతుంది. నా మనసు, హృదయాన్ని అద్భుతమైన సినిమా వెంటాడుతున్నది అని మడొన్నా తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది.అయితే మణిరత్నంను ఎందుకు కలిసింది మడొన్నా వెల్లడించలేదు. అలాగని మణిరత్నం క్యాంప్ కూడా ధృవీకరించలేదు.

 

దాంతో మడోన్నా పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తుందా అనే విషయంపై ఇంకా సందిగ్ధంగానే మారింది. అయితే ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, మోహన్ బాబు, అనుష్కశెట్టి, అమలా పాల్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన చిత్ర యూనిట్ నుంచి వెలువడలేదు. ఈ చిత్రం చోళ సామ్రాజ్యం కథా నేపథ్యంగా తెరకెక్కుతున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: