ఈ మద్య టాలీవుడ్ లో కొత్త దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. కంటెంట్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంటే అది చిన్నా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా బాగా ఆదరిస్తారని ఇప్పటికే పలు సినిమా విషయాల్లో రుజువు చేశారు.  ఆ మద్య కొత్త దర్శకుడు సందీప్ వంగా, అప్ కమింగ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ ఓ ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే. 

ఈ మూవీ బాలీవుడ్, కోలీవుడ్ లో రిమేక్ అయ్యాయి.  బాలీవుడ్ లో సందీప్ వంగా దర్శకత్వం వహించిన ‘కబీర్ సింగ్ ’మూవీలో విజయ్ దేవరకొండ పాత్రలో షాహిద్ కపూర్ నటించాడు. ఈ సినిమా రిలీజ్ అయి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. దాంతో సందీప్ వంగాకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ పెరిగిపోయింది.  త్వరలో తెలుగు లో మహేష్ బాబు తో ఓ మూవీ తీయబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తతం బాలీవుడ్ లో  నిర్మాతలంతా సందీప్ రెడ్డి వంగా గురించే మాట్లాడుకుంటున్నారట.

ఈ నేపథ్యంలో టి - సిరీస్ వారు ఆయనతో ఓ భారీ సినిమా చేయడానికి రంగంలోకి దిగినట్టుగా సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించబోతున్నారట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ఓకే అయితే దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా మరో స్థాయికి వెళ్లిపోతాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. కాకపోతే  ఈ వార్తలపై సల్మాన్, సందీప్ ల నుండి ఎలాంటి అధికార ప్రకటన లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: