కేఏ పాల్ అంటే అందరికీ తెలుసు. ఆయన తాజా ఎన్నికల్లో ప్రజాశాంత్రి పార్టీ అధ్యక్షునిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ  అధినేతగా ఆయన ఇచ్చిన  ఎంటర్టైన్మెంట్, చేసిన ప్రకటనలు   చాలా గొప్ప వినోదంగా  ఉంది. ఇక కేఏ పాల్ ఇపుడు నిజంగా వినోదాన్ని పంచనున్నారు. ఆయన బిగ్ బాస్ 3 లో కనిపిస్తారని న్యూస్ వైరల్ అవుతోంది.


జూలై మూడవ వారంలో మా  టీవీలో ప్రసారం కానున్న ఈ షోలో పాల్ తో పాటు చాలా మంది కనిపించే అవకాశం ఉంది. యాంకర్లు ఉదయభాను, శ్రీముఖి, జ్యోతి, లాస్య, నటులు వరుణ్ సందేశ్, తరుణ్, వవా హర్ష, గాయకుడు హేమచంద్ర, డ్యాన్స్ మాస్టర్ రఘు, నటి శ్రీరెడ్డి, మహా తల్లి ఫేం నటి జాహ్నవి వంటి వారు బిగ్ బాస్ 3 లో కనిపించి సందడి చేస్తారు.


ఇక బిగ్ బాస్ 3 షోకి హోస్ట్ గా మన్మధుడు నాగార్జున ఉంటారని స్టార్ మా ఇప్పటికే ప్రకటించింది. మొత్తానికి ఈ సీజన్లో వస్తున్న వారిలో ఎక్కువ మంది తెలిసిన వారు ఉన్నారు, పైగా ఎంటెర్టైన్మెంట్ బోలెడంత దొరికే అవకాశం ఉంది. సో చూసేందుకు అంతా రెడీ పోవడమే 


మరింత సమాచారం తెలుసుకోండి: