సంగీత దర్శకుడు మణిశర్మకు మెలొడీ బ్రహ్మ అనే బిరుదు ఉందన్న విషయం ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. సినిమా ఏ జానర్లో ఉన్నప్పటికి అందులో ఒక్కటైనా మెలొడీ సాంగ్ ఇస్తాడు మణిశర్మ. దర్శకులు కూడా అదే కోరుకుంటాడు. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమాకు కూడా ఇదే విధంగా ఓ మెలొడీ కంపోజ్ చేశాడు మణి. ఆ సాంగ్ రీసెంట్‌గా విడుదలైంది. అయితే మెలొడీ అనే ముసుగులో ట్యూన్ ను కాపీకొట్టేశాడు మణిశర్మ అంటున్నారు.

"ఉండిపో.." అనే లిరిక్స్ తో సాగే ఈ పాట బాణీ అచ్చుగుద్దినట్టు హిందీలో ఓ సూపర్ హిట్ సాంగ్స్ ను గుర్తుకుతెస్తోంది. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ నటించిన ఏ దిల్ హే ముష్కిల్, అజయ్ దేవగన్ నటించిన బాద్ షాహో సినిమాల నుంచి రెండు పాటల్ని మిక్స్ చేసి.. ఇస్మార్ట్ శంకర్ లో ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడు మణిశర్మ అని టాక్. 

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సాంగ్ పై పెద్ద రచ్చ జరుగుతోంది. మణిశర్మ లాంటి సీనియర్ సంగీత దర్శకులు ఇలా కాపీకొట్టడం ఏంటని కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం పూరి జగన్నాధ్ ఏరికోరి మరీ ఈ పాటలు రిఫరెన్స్ ఇచ్చి కంపోజ్ చేయించుకొని ఉంటాడంటూ చర్చించుకుంటున్నారు.

తెరవెనక ఏం జరిగిందనే విషయాన్ని పక్కనపెడితే, సాంగ్ మాత్రం కాపీ కొట్టారనే విషయం క్లియర్ గా తెలుస్తోంది. ఇక రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా స్టోరీలైన్ కు సంబంధించి ఇప్పటికే పెద్ద చర్చ జరుగుతోంది. ఇది ఓ హాలీవుడ్ సినిమాను కాపీ కొట్టి తీస్తున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఇప్పుడు తాజాగా రిలీజైన సాంగ్ కూడా కాపీ అని తేలడంతో ఈ రచ్చ మరీ ఎక్కువైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: