ఇటీవల టాలీవుడ్ నటి మరియు నిర్మాత, దర్శకురాలిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన శ్రీమతి విజయనిర్మల గారు అకాల మరణం పొందిన విషయం తెలిసిందే. ఇక ఆమె మరణంతో భర్త సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ గారితో సహా ఆమె కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయిందనే చెప్పాలి. 

అయితే విజయ నిర్మల గారి మృతితో చాలావరకు మానసికంగా కృంగిపోయిన కృష్ణ గారి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని పలువురు ప్రముఖులు ఇటీవల విచారం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఇక ఇటీవల దర్శకుడు త్రివిక్రమ్ సహా పలువురు సినీ ప్రముఖులు కృష్ణ గారిని కలిసి విజయ నిర్మల గారి మృతి పై తమ సంతాపాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇకపోతే నేడు యువరత్న నందమూరి బాలకృష్ణ స్వయంగా సూపర్ స్టార్ కృష్ణ గారి ఇంటికి చేరుకొని, హీరో నరేష్ ను అలానే కృష్ణ గారిని తనవంతుగా పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పారట. 

నటరత్న ఎన్టీఆర్ గారు నటించిన పాండురంగ మహత్యం సినిమా ద్వారా విజయనిర్మల గారు టాలీవుడ్ కి నటిగా పరిచయం అయ్యారని, ఇక దర్శకురాలిగా ఏకంగా 44 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆమె, గిన్నీస్ రికార్డు సాధించడం తెలుగు వారందరికీ గర్వకారణం అని అన్నట్లు సమాచారం. ఇక అంత గొప్ప వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, ఆమెతో తనకు గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ బాలకృష్ణ విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక త్వరలో బాలకృష్ణ, కెఎస్ రవికుమార్ ల కలయికలో రాబోతున్న చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: