సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.  ఈ మరణంతో కృష్ణ కుంగిపోయారు.  మహేష్ బాబు, నమ్రతలు అక్కడే ఉండి ఓదారుస్తున్నారు.  ఇక కృష్ణ ఇంటికి సెలెబ్రిటీలు వచ్చి కృష్ణకు సానుభూతి తెలియజేస్తున్నారు.  

ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీతో కలిసి వచ్చి కృష్ణకు సానుభూతి తెలియజేశారు.  బాలకృష్ణ కూడా వీళ్ళతో కలిసి రావడం విశేషం.  బాలకృష్ణ.. మహేష్ బాబులు పక్క పక్కన కూర్చోవడంతో చూడడానికి చాలా బాగుంది.  

చెప్పడానికి ఇది సందర్భం కాదుగాని, బాలకృష్ణ .. మహేష్ బాబులు కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు.  మహేష్ బాబుకు, బాలకృష్ణకు మాస్ లో మంచి పేరు ఉన్నది.  గతంలో కృష్ణ.. ఎన్టీఆర్ లు కలిసి సినిమాలు చేశారు.  

ఇప్పుడు బాలకృష్ణ.. మహేష్ లు కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుంది.  ప్రస్తుతం మహేష్ సరిలేరు నీకెవ్వరూ చేస్తుండగా.. బాలకృష్ణ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: