సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఓ బేబీ' సినిమా ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుసగా విజయాలతో దూసుకు పోతున్న సమంతకు 'ఓ బేబీ' సినిమా మరో విజయాన్ని ఆమె ఖాతాలో వేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ ఎదురు చూసేలా ఈ సినిమా టీజర్, ట్రైలర్ చేశాయి. కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ' సినిమాకి రీమేక్ అయిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా దర్శకురాలు నందిని రెడ్డి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.
 
ఒక సినిమాను రీమేక్ చేయడం వల్ల దర్శకులకు ఏమాత్రం ఉపయోగం ఉండదని.. సక్సెస్ అయితే మాతృక బాగుంది కనుక సక్సెస్ అయ్యిందని అంటారు.. ఫ్లాప్ అయితే మాతృకను చెడగొట్టారని అంటారు. అయినా కూడా మీరు మాత్రం ఈ సినిమాను చేసేందుకు ముందుకు వచ్చారు, అంటూ ప్రశ్నించగా దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ.. రీమేక్ వల్ల కెరీర్ కు ఏమాత్రం ఉపయోగం ఉండదనే విషయం తనకు తెలుసని.. ఐతే ఒక మంచి సినిమా తీశాననే సంతృప్తి కలగాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని చేసినట్లుగా నందిని రెడ్డి చెప్పారు. అంతేకాదుఈ సినిమాను సమంత నందిని దగ్గరకు తీసుకు వచ్చినప్పుడు కాస్త ఆలోచించిందట. అయితే సినిమాను ఉన్నది ఉన్నట్లుగా మక్కీ కి మక్కీ దించకుండా ఒరిజినల్ ను 60 శాతం మాత్రమే తీసుకుని మిగిలినది తెలుగు నేటివిటీకి తగ్గట్టుగాగా ఉండేలా కథలో మార్పులు చేర్పులు చేశారట. 

ఈ సినిమాని కామెడీ సినిమాగా ప్రమోట్ చేసినా కూడా ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత జనాలు ఇందులో ఎమోషన్ సీన్స్ కూడా ఉంటాయని ఆశిస్తున్నారు. నిజంగానే ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ప్రివ్యూ చూసిన 200 మంది సినిమా పూర్తి అయిన తర్వాత కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. ఇది ఖచ్చితంగా అన్ని రకాల ఎమోషన్స్ ను ప్రేక్షకులకు కలిగిస్తుందని నందిని రెడ్డి చెప్పడం సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మరి త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్న ఈ సినిమా థియోటర్స్ లో ఎలా సందడి చేస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: