రాజుగారి గది-3 గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో పారంభమైన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఓపెనింగ్ కు కూడా వచ్చి, ఆ తర్వాత ఏకంగా సినిమా నుండే తప్పుకుంది తమన్న. అందుకు కారణం తన క్యారెక్టర్ లో మార్పులు చేర్పులు చేయడమే అని కూడా తెలిసిందే. అలా రాజుగారి గది-3 సినిమా మెయిన్ లీడ్ లేకుండానే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ఇప్పుడు యూనిట్ అంతా మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారని లేటెస్ట్ న్యూస్. తమన్న స్థానంలో తాప్సిని తీసుకునే ఆలోచనలో ఉందట చిత్ర బృందం. ప్రస్తుతానికి తాప్సీతో చర్చలు సాగుతున్నాయట. అయితే ఇంకా ఏదీ కన్ ఫర్మ్ కాలేదని ఫ్రెష్ అప్‌డేట్.

హారర్, థ్రిల్లర్ సినిమాలకు ప్రస్తుతం అనుష్క తర్వాత అంతగా క్రేజ్ ఉంది తమన్న, తాప్సి, కే. నందిత శ్వేత, నందిత రాజ్ లాంటి చిన్న హీరోయిన్లు ఉన్నప్పటికీ వాళ్లతో సినిమాలు తీస్తుంటే క్రేజ్ రావడంలేదు. ఒక సందర్భంలో పెట్టిన డబ్బులు కూడా రావడం లేదని టాక్.  మరోవైపు అనుష్క నెమ్మదిగా ఆచి తూచి సినిమాలను సెలక్ట్ చేసుకుంటోంది.  ఈ నేపథ్యంలోనే దర్శక నిర్మాతలు తమన్న, తాప్సి వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఏ చిన్న బాలీవుడ్ ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకోదు తమన్న. అలాంటి ఓ చిన్న అవకాశం రావడంతో రాజుగారి గది-3 నుంచి తప్పుకుంది మిల్కి బ్యూటీ. 

ఇప్పుడా స్థానాన్ని భర్తీ చేయగలిగిన ఒకే ఒక్క ఆప్షన్ తాప్సి. అందుకే దర్శకుడు ఓంకార్ తాప్సీ కోసం ట్రై చేస్తున్నాడని సమాచారం. నిజానికి ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకోవాలనేది ఓంకార్ ప్లాన్ అని రీసెంట్‌గా తెలిసిన వార్త. అందుకు కారణం రాజుగారి గది-2లో సమంత నటించింది. కానీ పార్ట్-3 స్టోరీ సమంతకు నచ్చలేదని ఇన్‌సైడ్ టాక్. అందుకే సమంత ఒప్పుకోకపోవడంతో తమన్నాను తీసుకున్నారు. ఇప్పుడు ఆమె కూడా తప్పుకోవడంతో తాప్సి కోసం ట్రై చేస్తున్నారు. మరి తాప్సి కూడా నో చెబితే ఎవర్ని తీసుకుంటారో చూడాలి. లేదంటే గదిలో ఓంకార్ ఒక్కడే మిగిలిపోతాడో..!



మరింత సమాచారం తెలుసుకోండి: