పూరి జగన్నాథ్ -రామ్ పోతినేనిల కాంబినేషన్ లో పూరీ-చార్మి కలిసి నిర్మిస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా విడుదల డేట్ దగ్గరకు వస్తోంది. ఈనెల 18న విడుదల చేయడానికి  అన్నీ కార్యక్రమాలను శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. అందుకే ప్రమోషన్స్ కార్యక్రమాలు బాగా ఊపందుకోనున్నాయి. ఇక ఇప్పటికే పాటల వీడియో బిట్ లు, టీజర్ బయటకు వచ్చాయి. ఇప్పుడు థియోట్రికల్ ట్రైలర్ రాబోతోంది. ఈ సినిమా మీద దర్శక, నిర్మాతల తో పాటు హీరో హీరోయిన్స్ కూడా పూర్తి థీమాతో వున్నారు. ఎందుకంటే పూరీకి, కి, హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభా నటేష్ కి హిట్టే లేదు కాబట్టి.

అందుకే అనుకున్న ఫిగర్ వచ్చేవరకు బిజినెస్ క్లోజ్ చేయకుండా అలాగే వుంచారు. ఆంధ్ర 10 కోట్ల రేషియోలో చెబుతున్న ఈ సినిమా నైజాం మాత్రం దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. ఇంతకముందు పూరి తెరకెక్కించిన మెహబూబా ఫ్లాప్ అవడంతో ఆ లెక్కలు ఏవో వుండడంతో సినిమా ఆయన దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే ఈ సినిమా ట్రైలర్ ను ఇప్పటికే ఇండస్ట్రీ జనాలు కొందరు చూసారట. ట్రైలర్ బాగుందని టాక్ అప్పుడే స్టార్ట్ అయింది. అయితే సినిమాలో వున్న కాస్త బూతులు చాలా పద్దతిగా, అందంగా ట్రైలర్ లో కూడా వినిపించాయని, దాంతో ట్రైలర్ మాంచి క్రేజీగా వచ్చిందని తెలుస్తోంది. ట్రైలర్ వచ్చిన తరువాత బిజినెస్ కు ఊపు వస్తుందని ఇస్మార్ట్ శంకర్ యూనిట్ భావిస్తోంది. మరి ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న మంచి కమర్షియల్ హిట్ ఈ సినిమాతోనైనా పడుతుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: