టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కున్న ఫాలోయింగే వేరు. అన్నయ్య చిరంజీవి నుంచి నటనే వారసత్వం అనుకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్ లో ఆ అన్నయ్యకు తగ్గ తమ్ముడనిపించుకున్నాడు. పొలిటీషియన్ గా మారాక కూడా ఆయనకున్న ఫాలోయింగ్.. మైండ్ బ్లోయింగే..! పవన్ అనే పేరు వినగానే పూనకాలు వచ్చేస్తాయి అభిమానులకు. అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు పవన్ కల్యాణ్. విషయంలోకి వస్తే..

 

తన కోసం ప్రాణాలిచ్చే అభిమానుల్ని సొంతం చేసుకున్న పవన్.. వారికి ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే.. అందునా పేదలని తెలిస్తే ఊరుకుంటాడా. విజయనగరం, ఖమ్మం జిల్లాలకు చెందిన ఇద్దరు అభిమానుల ఆరోగ్య, ఆర్ధిక పరిస్థితుల గురించి తెలుసుకున్న పవన్ వారికి ఆర్ధికసాయమందించి “నేనున్నాను” అంటూ భరోసా ఇచ్చారు. విజయనగరంకు చెందిన విశ్వతేజ అనే అభిమానికి క్యాన్సర్ సోకినట్టు తెలయడంతో పవన్ వెంటనే రెండు లక్షల రూపాయల చెక్కును పంపించాడట. ఖమ్మం జిల్లాకు చెందిన గుబ్బాల సతీశ్ కు కూడా అనారోగ్యం అని తెలుసి లక్ష రూపాయల చెక్కును అందించారు. దీంతో అందరూ పవన్ దయాగుణాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ దయాగుణమే పవన్ అభిమానులను ఆయనకు భక్తులుగా మారేలా చేసిందని అనికుంటున్నారు.

 

 గతంలో కూడా ఇండస్ట్రీలోని పేదలకు అనేకసార్లు పవన్ ఆర్ధికసాయం చేసారు. కొద్దిమంది ఇచ్చిన ఇంటర్వూల ద్వారా ఈ విషయం తెలిసింది. సీనియర్ నటి పావలా శ్యామలకు కూడా పవన్ ఆర్ధిక సాయం అందించారు. దీంతో పవన్ దాతృత్వాన్ని పలువురు మెచ్చుకుంటున్నారు, అందరూ అభినందిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: