తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.  ఇప్పటివరకు  జరిగిన రెండు సీజన్స్ ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. అయితే ప్రస్తుతం మరి కొద్ది రోజుల్లో మూడవ సీజన్ స్టార్ట్ కాబోతుంది. అయితే ఆ సీజన్ లో కంటెస్టెంట్స్ ఎవరా అని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. సాధారణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరనేది షో స్టార్ట్ అయ్యే వరకు తెలీదు. కానీ ప్రజల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని పుకార్లు మాత్రం బయటకు వస్తుంటాయి.

 

అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ లో ఇద్దరు రియల్ లైఫ్ కపుల్‌లను కంటెస్టెంట్‌ల లిస్ట్‌లో పెట్టాలని నిర్వాహకులు భావిస్తున్నారట. అందులో భాగంగా టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్, హీరోయిన్ వితికా శేరులను బిగ్‌బాస్ నిర్వాహకులు కలిసినట్లు సమాచారం. ఇక ఇందులో పాల్గొనేందుకు వారు కూడా ఉత్సహాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది.

 

‘హ్యాపీడేస్’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్.. ఆ తరువాత ‘కొత్త బంగారు లోకం’తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ పైన పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. చెప్పుకోదగ్గ హిట్‌ను సొంతం చేసుకోలేకపోయాడు. 2016లో ‘మిస్టర్ 420’ తరువాత సినిమాలకు దూరం అయ్యాడు. మరోవైపు ‘ఝుమ్మంది నాదం’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘పడ్డానండి ప్రేమలో మరీ’ వంటి చిత్రాల్లో నటించిన వితికా.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది.

 

ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు బిగ్‌బాస్ 3 తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. మరి కొద్ది రోజుల్లో ఈ సీజన్ కి హోస్ట్ గా "కింగ్ నాగార్జున " వ్యవహరించనున్నారు. ప్రస్తుతం నాగార్జున మన్మధుడు 2 సినిమాలో బిజీగా ఉన్నాడు. నాగార్జునకి బుల్లితెర మీద హోస్ట్ గా చేసిన అనుభవం ఉంది కాబట్టి నాగార్జున వైపు మొగ్గు చూపారు బిగ్ బాస్ నిర్వాహకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: