బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా విజయంతో ప్రభాస్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. చైనా ,జపాన్ లో సైతం ప్రభాస్ కి అభిమానులు ఉన్నారు. మొన్న జపాన్ నుండి అభిమానులు ప్రభాస్ ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ తన తాజా చిత్రం "సాహో" పనుల్లో బిజీగా ఉన్నాడు.

 

సాహో టీజర్ రిలీజై ఎంతటి రెస్పాన్స్ తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాకి సంబంధించిన పనులు చకచకా చేసేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ -శ్రద్ధాకపూర్ ల మధ్య డ్యూయెట్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. చిత్రీకరణ కోసం ఈ సినిమా టీమ్ ఇటీవల ఆస్ట్రియా వెళ్లింది. ఆ దేశంలోని ఆల్ప్స్ పర్వతాల్లో ప్రభాస్ - శ్రద్ధా కపూర్ లపై ఒక డ్యూయెట్ ను చిత్రీకరిస్తున్నారు.మంచు పర్వతాల్లో చిత్రీకరిస్తోన్న ఈ రొమాంటిక్ సాంగ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

 

ప్రభాస్ చాలా కాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉన్నారు. అయితే ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్ లో ఖాతా ఓపెన్ చేసి, అభిమానులతో సాహో చిత్ర విషయాలను పంచుకుంటున్నాడు.హాయ్‌ డార్లింగ్స్‌. ప్రస్తుతం సాహో షూటింగ్‌ ఆస్ట్రియాలో జరుగుతోంది. గతంలో ఇలాంటి అనుభూతులను ఎప్పుడూ చూడలేదు. అద్భుతంగా ఉంది’ అని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో ప్రభాస్‌తో పాటు కథానాయిక శ్రద్ధాకపూర్‌ కూడా ఉంది.

 

రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని యు వి క్రియేషన్స్ నిర్మిస్తుంది. నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం జిబ్రాన్ అందిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: