తెలుగు ఇండస్ట్రీలోకి ఏం మాయ చేసావే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన సమంత తన సహనటుడు అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.  ప్రస్తుతం అక్కినేని సమంత ‘ఓ బేబీ’చిత్రంలో నటిస్తుంది.  అయితే ఈ చిత్రం గురించి ఇప్పటికే భారీ ఎత్తున ప్రమోషన్ వర్క్ చేస్తుంది సమంత.  అంతే కాదు ఈ చిత్రంలో ఇప్పటి వరకు తాను నటించని పాత్ర అని, ఈ పాత్ర కోసం తాను ఎంతో కష్టపడ్డానని పలు ఇంటర్వ్యూల్లో తెలిపింది. 

ఈ మద్య రిలీజ్ అయిన ట్రైలర్ వర్షన్ కూడా సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  దాంతో ‘ఓ బేబీ’ చిత్రంపై టాలీవుడ్ లో అంచనాలు భారీగా పెరిగాయి.  ఈ నెల 5న(శుక్రవారం) చిత్రం విడుదలకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకున్నారు. సాధారణంగా స్టార్ హీరోలకు పెద్ద పెద్ద కటౌట్స్ ఏర్పాటు చేయడం చూస్తుంటాం..కానీ ఈసారి మాత్రం ఆ క్రెడిట్ సమంతకు దక్కింది.

హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో సమంత నిలువెత్తు కటౌట్ ను అభిమానులు ఏర్పాటు చేశారు. నగరంలోని దేవి థియేటర్ లో సమంత చిరునవ్వులు చిందిస్తున్న భారీ కటౌట్ ను పెట్టారు.  దక్షిణకొరియాకు చెందిన సినిమా మిస్ గ్రానీ(2014) స్ఫూర్తితో ‘ఓ బేబీ’ని దర్శకురాలు నందినీరెడ్డి తెరకెక్కించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: