పూరి జగన్నాథ్ లేటెస్ట్ మూవీ ఇష్మార్ట్ శంకర్ టీజర్ తోనే మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్నది. పూరి జగన్నాధ్ ఎలాగైనా ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. పూరి జగన్నాధ్ సినిమాల్లో హీరోలకు ఓ మార్క్ వుంటుంది. పూరి మార్క్ హీరోలు అన్నమాట. రఫ్ గా మాట్లాడతాయి.. రఫ్ గా ప్రవర్తిస్తాయి.. అలాంటి హీరో మరొకడు వచ్చాడు. రామ్. లేటెస్ట్ గా పూరి హీరో. అతగాడితో పూరి చేసినఇస్మార్ట్ శంకర్ సినిమా ఈనెల 18న విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రయిలర్ ఇప్పుడు బయటకు వచ్చింది.


అచ్చంగా పూరి మార్క్ అవుట్ అండ్ అవుట్ మాస్ ట్రయిలర్ కట్ చేసి వదిలారు. ఎప్పుడూ వుండే పూరి మార్కు హీరోయిజం, హీరో డైలాగులు వంటి వాటికి హీరోయిన్ల ఎక్స్ పోజింగ్, పచ్చి డైలాగులు, అదనపు అర్హతలు. స్టోరీలోని కీలకపాయింట్ ను ముందే రివీల్ చేసేసారు. బ్రెయిన్ లో చిప్ పెట్టడం అన్నది ఆ పాయింట్. ఆ సంగతి అలావుంచితే ఈసారి యాక్షన్ సీన్లు ట్రయిలర్ లో తగ్గాయి. సినిమాలో వుండే వుంటాయి.


కానీ మిగిలిన 'మాస్ మాసాలా పోపుసామాన్లు' ట్రయిలర్ లో ఇవ్వడం కోసం యాక్షన్ సీన్లు తగ్గించినట్లు కనిపిస్తోంది. టోటల్ గా ఈ మధ్య సరైన మాస్ సినిమా రాలేదని, ఎదురుచూస్తున్న బి సి సెంటర్ల ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టడానికి పూరి జగన్నాధ్ సిద్దం అయిపోయినట్లు కనిపిస్తోంది ట్రయిలర్ చూస్తుంటే. సెన్సారు గండాన్ని కొన్ని డైలాగులు, సీన్లు దాటి వస్తే..

మరింత సమాచారం తెలుసుకోండి: