పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ అంటూ క్రేజీ ట్రైలర్ తో వచ్చిన ఈ సినిమాతో పూరి ఎలాగైనా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ నటిస్తుండగా ఇస్మార్ట్ శంకర్ పై పూరి ఎఫర్ట్స్ అన్ని ప్రచార చిత్రాల్లో తెలుస్తున్నాయి. అందుకే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతుంది. 


పూరి గత సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఇస్మార్ట్ శంకర్ సినిమా వస్తుంది. బిజినెస్ లో కూడా ఆ జోష్ కనిపిస్తుంది. ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఆంధ్రా మొత్తం 10 కోట్ల దాకా బిజినెస్ చేయగా మిగిలిన ఏరియాలు కూడా మంచి బిజినెస్ చేసిందని తెలుస్తుంది. ఇక డిజిటల్, శాటిలైట్ రైట్స్ రూపంలో కూడా ఇస్మార్ట్ శంకర్ జోరు కొనసాగించాడట.


శాటిలైట్, డిజిటల్ రైట్స్ కలిపి 14 కోట్లకు జీ సంస్థ ఫైనల్ చేసిందట. అయితే వరుస అపజయాలు ఎదుర్కున్న పూరి జగన్నాథ్ కు ఇస్మార్ట్ బిజినెస్ కాస్త ఊరట కలిగిస్తుంది. అయితే కొద్ది గంటల క్రితం రిలీజైన ఈ సినిమా ట్రైలర్ పక్కా మాస్ మసాలా సినిమా అనేలా ఉంది. పూరి మార్క్ మాస్ క్యారక్టరైజేషన్ తో ఈ సినిమా వస్తుంది.


రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో పాటుగా నిధి అగర్వాల్, నభా నటేష్ ల గ్లామర్ షో అదిరిపోయిందని తెలుస్తుంది. సినిమా కంటెంట్ విషయంలో కూడా పూరి ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదని తెలుస్తుంది. చార్మి, పూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా అయినా పూరికి హిట్ అందిస్తుందో లేదో చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: